Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 09:51 PM

పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి – కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశాలు

పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి – కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశాలు

పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి – కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశాలు
February 19, 2026 08:14 PM 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య జిల్లా ప్రభుత్వ పాఠశాలలు మరియు అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆదేశించారు. గురువారం కలెక్టర్ తన ఛాంబర్‌లో పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, గ్రామీణాభివృద్ధి, విద్యుత్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.సమావేశంలో కలెక్టర్ అధికారులను తక్షణంగా పాఠశాలల్లో మరియు అంగన్‌వాడీ కేంద్రాల్లో పూర్తి అయిన పనుల వివరాలు, కొనసాగుతున్న పనుల జాబితాను సమర్పించాలని, మంజూరు చేసిన టాయిలెట్లు నిర్మాణం, మరమ్మత్తులు వేగవంతం చేయాలని, విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచి మరుగుదొడ్లు సక్రమంగా పనిచేయేలా చూడాలని సూచించారు. అదనంగా, అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యుత్ కనెక్షన్లు, మౌలిక సదుపాయాలు, పాఠశాలల్లో టాయిలెట్లు పూర్తయిన వెంటనే కాంట్రాక్టర్లు వాటిని హెడ్‌మాస్టర్లకు అప్పగించి వెంటనే వాడుకలోకి తీసుకురావాలని సూచించారు.కలెక్టర్ మరోవైపు స్వయం సహాయక బృందం ఫెడరేషన్ భవన నిర్మాణ వివరాలను తక్షణం అందించమని, ఈజిఎస్ పల్లెల్లో అంగన్‌వాడీ భవనాలు, పాఠశాలల్లో కంపౌండ్ వాల్ పనులను త్వరగా పూర్తి చేయమని, ఈజిఎస్ లేబర్ చెల్లింపులు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాజా ఎన్నికైన గ్రామ సర్పంచులు, ఉపసర్పంచులు గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనమని, మండల పరిషత్ అధికారులు, పంచాయతీ సెక్రటరీలు గ్రామ సభలను ఏర్పాటు చేసి సమన్వయంతో అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేయాలని సూచించారు.సమావేశంలో పీడీ డిడిఆర్డిఓ జ్యోతి, డిడబ్ల్యూఓ లలిత కుమారి, సీపీఓ బాలశౌరి, అదనపు డిఆర్డిఓ బాలరాజ్, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, విద్యుత్ శాఖ, విద్యాశాఖ మరియు ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News