పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి – కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశాలు
పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి – కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశాలు
Krishna
జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య జిల్లా ప్రభుత్వ పాఠశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని ఆదేశించారు. గురువారం కలెక్టర్ తన ఛాంబర్లో పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, గ్రామీణాభివృద్ధి, విద్యుత్ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.సమావేశంలో కలెక్టర్ అధికారులను తక్షణంగా పాఠశాలల్లో మరియు అంగన్వాడీ కేంద్రాల్లో పూర్తి అయిన పనుల వివరాలు, కొనసాగుతున్న పనుల జాబితాను సమర్పించాలని, మంజూరు చేసిన టాయిలెట్లు నిర్మాణం, మరమ్మత్తులు వేగవంతం చేయాలని, విద్యార్థుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచి మరుగుదొడ్లు సక్రమంగా పనిచేయేలా చూడాలని సూచించారు. అదనంగా, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్ కనెక్షన్లు, మౌలిక సదుపాయాలు, పాఠశాలల్లో టాయిలెట్లు పూర్తయిన వెంటనే కాంట్రాక్టర్లు వాటిని హెడ్మాస్టర్లకు అప్పగించి వెంటనే వాడుకలోకి తీసుకురావాలని సూచించారు.కలెక్టర్ మరోవైపు స్వయం సహాయక బృందం ఫెడరేషన్ భవన నిర్మాణ వివరాలను తక్షణం అందించమని, ఈజిఎస్ పల్లెల్లో అంగన్వాడీ భవనాలు, పాఠశాలల్లో కంపౌండ్ వాల్ పనులను త్వరగా పూర్తి చేయమని, ఈజిఎస్ లేబర్ చెల్లింపులు ఆలస్యం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాజా ఎన్నికైన గ్రామ సర్పంచులు, ఉపసర్పంచులు గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనమని, మండల పరిషత్ అధికారులు, పంచాయతీ సెక్రటరీలు గ్రామ సభలను ఏర్పాటు చేసి సమన్వయంతో అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేయాలని సూచించారు.సమావేశంలో పీడీ డిడిఆర్డిఓ జ్యోతి, డిడబ్ల్యూఓ లలిత కుమారి, సీపీఓ బాలశౌరి, అదనపు డిఆర్డిఓ బాలరాజ్, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, విద్యుత్ శాఖ, విద్యాశాఖ మరియు ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి