Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:54 PM

పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు
March 16, 2026 08:18 PM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

రాజపేట,మండలంలోని దూదివెంకటాపురం, రేణికుంట గ్రామాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సోమవారం పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.దూదివెంకటాపురం గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్న ఆయన గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా గ్రామస్థులు సహకరించాలని కోరారు. గ్రామ సమస్యలను గ్రామసభలోనే చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. అధికారులు, ప్రజలు కలిసి పనిచేస్తే గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని అన్నారు.అనంతరం రేణికుంట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్ విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు పరిశుభ్రంగా,పోషకాహారంతో కూడిన నాణ్యమైన భోజనం అందించాలని పాఠశాల సిబ్బందికి సూచించారు. మంచి నీటి సౌకర్యాన్ని పరిశీలించి విద్యార్థుల ఆరోగ్యం,చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు.తరువాత రేణికుంట గ్రామంలోని నర్సరీని సందర్శించి మొక్కల పెంపకం, సంరక్షణపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో విస్తృతంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు.అనంతరం రేణికుంట గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ గ్రామ ప్రజలకు అవసరమైన సేవలను త్వరితగతిన అందించాలని సూచించారు. మార్చి 31లోపు వంద శాతం ఇంటి పన్ను వసూలు చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో దూది వెంకటాపురం సర్పంచ్ నరేష్, రేణికుంట సర్పంచ్ కర్రె వెంకటేష్, ఎంపీవో ఆవుల కిషన్, ఇంచార్జ్ ఏపీవో కర్ణాకర్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News