Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాఠశాల అభివృద్ధికి అందరూ సహకరించాలి. బోగారం తల్లిదండ్రుల సమావేశంలో సర్పంచ్ సాయికుమార్ గౌడ్ డిజిటల్‌ సభ్యత్వ నమోదుకు బీఆర్‌ఎస్‌ శ్రీకారం. ఎర్రవెల్లిలో కేసీఆర్‌తో కీలక సమావేశం సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 14, 2026 04:11 PM

పాఠశాల అభివృద్ధికి అందరూ సహకరించాలి. బోగారం తల్లిదండ్రుల సమావేశంలో సర్పంచ్ సాయికుమార్ గౌడ్

పాఠశాల అభివృద్ధికి అందరూ సహకరించాలి. బోగారం తల్లిదండ్రుల సమావేశంలో సర్పంచ్ సాయికుమార్ గౌడ్

పాఠశాల అభివృద్ధికి అందరూ సహకరించాలి.  బోగారం తల్లిదండ్రుల సమావేశంలో సర్పంచ్ సాయికుమార్ గౌడ్
May 14, 2026 02:38 PM 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ ఆదేశాల మేరకు రామన్నపేట మండలంలోని బోగారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల అడ్మిషన్లు, పాఠశాల అభివృద్ధి, సమ్మర్ క్యాంపు నిర్వహణ తదితర అంశాలపై తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ హాజరై మాట్లాడారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. పాఠశాల అభివృద్ధికి గ్రామస్తులందరూ సహకరించాలని కోరారు. విద్యార్థుల ప్రతిభాభివృద్ధికి సమ్మర్ క్యాంపులు ఉపయోగపడతాయని తెలిపారు.

కార్యక్రమంలో ఉప సర్పంచ్ బైకాని ఉమామహేష్ యాదవ్, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ పబ్బు జ్యోతి, వార్డు సభ్యులు కనుక మల్లేష్, నేరటి మానస సురేష్ యాదవ్, కడారి పావని పాపయ్య, గోగు సురేష్ యాదవ్, వనం అండాలు యాదగిరి, ప్రధానోపాధ్యాయుడు ముస్కా వెంకట్‌రెడ్డి, ఉపాధ్యాయులు శ్రీలత, శేఖర్, గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News