Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 08:24 PM

పాత మిర్చి యార్డు దుస్థితి

పాత మిర్చి యార్డు దుస్థితి

పాత మిర్చి యార్డు దుస్థితి
February 10, 2026 05:42 PM 135 Views
Reporter
స్థానికం ప్రతినిధి : సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Biksham Goud

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన స్థలం

సూర్యాపేట పట్టణంలోని పాత మిర్చి యార్డు స్థలం అసాంఘిక కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా మారింది. ఈ స్థలాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో నియోజకవర్గ కేంద్రం చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక జిల్లా కేంద్రం నుంచి కూడా రకరకాల వ్యక్తులు ఇక్కడికి చేరుకుంటున్నారు.ఈ స్థలం మలమూత్రాల విసర్జనకు అడ్డాగా మారడమే కాకుండా పశువులు, పందులు, కుక్కలు తిరిగే ప్రదేశంగా తయారైంది. పగలంతా ఇక్కడ అనవసర సమావేశాలు, కాలక్షేపం, మద్యం సేవించే గుంపులు కూర్చుంటుండగా, రాత్రి వేళ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే అనుమానాలు అక్కడి పరిస్థితులు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

విశేషమేమిటంటే ఇదే స్థలానికి ఆనుకొని సూర్యాపేట శాసనసభ్యుల శిబిర కార్యాలయం ఉండటం. అయినా సంబంధిత అధికారులు తెలిసీ తెలిసీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ మధ్యలో ఉన్న ఈ స్థలాన్ని అష్టదరిద్రంగా, కంపు కంపుగా వదిలేయడం దురదృష్టకరమని, శోచనీయమని ప్రజలు అంటున్నారు.సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ స్థలాన్ని శుభ్రపరచడంతో పాటు, లోపలికి ఎవరు ప్రవేశించకుండా తగిన భద్రత ఏర్పాటు చేయాలని, పట్టణ గౌరవాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News