పటేల్ రమేష్ రెడ్డి వ్యూహం ఇదేనా
పటేల్ రమేష్ రెడ్డి వ్యూహం ఇదేనా
Biksham
సూర్యాపేట రాజకీయాల్లో కొత్త మలుపు?
మున్సిపల్ ఎన్నికల అనంతరం సూర్యాపేట నియోజకవర్గ రాజకీయాలు కీలక మలుపు తిరగనున్నాయనే చర్చ జోరుగా సాగుతోంది. శాసనసభ్యుడిగా గెలిచి అసెంబ్లీకి వెళ్లాలన్న తన చిరకాల ఆకాంక్షను నెరవేర్చుకునే దిశగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.రాజకీయంగా తన ఎదుగుదలకు అన్ని విధాలుగా తోడ్పడిన పాత తరం నాయకులు, కార్యకర్తలను మున్సిపల్ ఎన్నికల అనంతరం ఏకం చేయాలని రమేష్ రెడ్డి భావిస్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటినుంచే నియోజకవర్గంలో బలమైన కేడర్ను సిద్ధం చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారని సమాచారం.ఇతర పార్టీలలో కొనసాగుతున్న పాత బ్యాచ్ సభ్యులు ఎన్నికల తర్వాత రమేష్ రెడ్డి నాయకత్వాన్ని ఆశ్రయించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ, వామపక్ష పార్టీలలో ఉన్న ఆయన అనుచరులు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావచ్చనే చర్చ జరుగుతోంది.ఇదే జరిగితే సూర్యాపేట రాజకీయ సమీకరణలు పూర్తిగా మారతాయని, పార్టీలకు పార్టీల మధ్య కదలికలు పెరిగే అవకాశముందని నాయకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో పార్టీలు మారబోయే కౌన్సిలర్ అభ్యర్థులు ఎవరు అనే అంశంపై నియోజకవర్గవ్యాప్తంగా రాజకీయ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి