Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 09:50 PM

పట్టణ అభివృద్ధి హామీలతో ఖేడ్‌లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార ర్యాలీలో: మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే

పట్టణ అభివృద్ధి హామీలతో ఖేడ్‌లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార ర్యాలీలో: మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే

పట్టణ అభివృద్ధి హామీలతో ఖేడ్‌లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార ర్యాలీలో: మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే
February 09, 2026 04:44 PM 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు నారాయణఖేడ్ పట్టణంలో రోడ్ షో మరియు కార్నర్ మీటింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్,జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శేట్కర్,నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి,నగేష్ శేట్కర్ పాల్గొన్నారు.కార్యక్రమానికి ముందు మంత్రి అజారుద్దీన్ స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మంగళ్‌పేట్‌లోని దుర్గ భవాని ఆలయం నుండి బైపాస్‌లో ఉన్న శివాజీ చౌక్ వరకు భారీ ర్యాలీగా సాగారు. అక్కడి నుంచి రాజీవ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి అజారుద్దీన్ నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని 15 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎన్నికలను సవాలుగా తీసుకుని పార్టీ విజయానికి అంకితభావంతో పని చేయాలని పిలుపునిచ్చారు. గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం నారాయణఖేడ్ పట్టణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, కనీస మౌలిక సదుపాయాలు కూడా అందించలేక ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారాయణఖేడ్ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.పట్టణంలో రింగ్ రోడ్డు, అర్బన్ పార్క్, పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు, త్రాగునీటి సమస్య పరిష్కారం, నిరంతర విద్యుత్ సరఫరా వంటి అంశాలపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు నిర్మించి, ప్రతి గల్లీ అభివృద్ధి చెందేలా ప్రణాళికబద్ధంగా పనులు చేపట్టామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని 15 వార్డుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు,పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News