పశు ఔషధ బ్యాంక్కు NRI భారీ విరాళం!
కోదాడ ప్రాంతీయ పశువైద్యశాలలోని 'పశు ఔషధ బ్యాంక్' సేవలకు ముగ్ధుడై అమెరికా NRI డాక్టర్ చప్పిడి సుధాకర్ ఉదారత చాటుకున్నారు. రూ. 45 వేల విలువైన ఆర్థోపెడిక్ సర్జరీ పరికరాలను విరాళంగా పంపారు. ఎముకలు విరిగిన మూగజీవాలకు ఆపరేషన్ చేసేందుకు అవసరమైన డ్రిల్లింగ్ మెషీన్లు, రాడ్లు, కట్టర్లను ఏడీ డాక్టర్ పెంటయ్య కు అందజేశారు. గతంలోనూ వీరు మందులు విరాళంగా ఇచ్చారని అధికారులు కొనియాడారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి