Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:05 AM

పసుమాముల–కళానగర్‌లో ఎన్ఎస్ఎస్ శీతాకాల ప్రత్యేక శిబిరాల ప్రారంభం

పసుమాముల–కళానగర్‌లో ఎన్ఎస్ఎస్ శీతాకాల ప్రత్యేక శిబిరాల ప్రారంభం

పసుమాముల–కళానగర్‌లో ఎన్ఎస్ఎస్ శీతాకాల ప్రత్యేక శిబిరాల ప్రారంభం
January 02, 2026 07:27 PM 77 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

హయత్ నగర్ స్థానిక ప్రతినిధి

పసుమాముల, కళానగర్ గ్రామాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్ ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో శీతాకాల ప్రత్యేక శిబిరాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కళాశాల ప్రిన్సిపల్ డా. పి. సురేష్‌బాబు శిబిరాలను ప్రారంభించి మాట్లాడారు. ఎన్ఎస్ఎస్ యూనిట్–1 వాలంటీర్లు కళానగర్‌లో, యూనిట్–2 వాలంటీర్లు పసుమాముల గ్రామంలో జనవరి 8 వరకు ఏడు రోజులపాటు నివసిస్తూ గ్రామస్తుల సహకారంతో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ప్రజాప్రతినిధి కొత్త జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, సేవాభావంతో గ్రామానికి వచ్చిన కళాశాల వాలంటీర్లకు గ్రామం తరపున పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.

శిబిర ప్రారంభ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాబురావు, కళాశాల అకాడమీ కోఆర్డినేటర్ బి. నరసింహ, అధ్యాపకులు రమాదేవి, సుబ్రహ్మణ్యం, శ్రీపతి నాయుడు, నాగరాజు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు యాదగిరి రెడ్డి, శారదా దేవి, స్థానికులు బిక్షపతి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్ల ఉత్సాహం గ్రామాల్లో సేవా వాతావరణాన్ని నెలకొల్పిందని గ్రామస్తులు అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News