పసుమాముల–కళానగర్లో ఎన్ఎస్ఎస్ శీతాకాల ప్రత్యేక శిబిరాల ప్రారంభం
పసుమాముల–కళానగర్లో ఎన్ఎస్ఎస్ శీతాకాల ప్రత్యేక శిబిరాల ప్రారంభం
Editor Desk
హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు
హయత్ నగర్ స్థానిక ప్రతినిధి
పసుమాముల, కళానగర్ గ్రామాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్నగర్ ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో శీతాకాల ప్రత్యేక శిబిరాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కళాశాల ప్రిన్సిపల్ డా. పి. సురేష్బాబు శిబిరాలను ప్రారంభించి మాట్లాడారు. ఎన్ఎస్ఎస్ యూనిట్–1 వాలంటీర్లు కళానగర్లో, యూనిట్–2 వాలంటీర్లు పసుమాముల గ్రామంలో జనవరి 8 వరకు ఏడు రోజులపాటు నివసిస్తూ గ్రామస్తుల సహకారంతో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ప్రజాప్రతినిధి కొత్త జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, సేవాభావంతో గ్రామానికి వచ్చిన కళాశాల వాలంటీర్లకు గ్రామం తరపున పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.
శిబిర ప్రారంభ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాబురావు, కళాశాల అకాడమీ కోఆర్డినేటర్ బి. నరసింహ, అధ్యాపకులు రమాదేవి, సుబ్రహ్మణ్యం, శ్రీపతి నాయుడు, నాగరాజు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు యాదగిరి రెడ్డి, శారదా దేవి, స్థానికులు బిక్షపతి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్ల ఉత్సాహం గ్రామాల్లో సేవా వాతావరణాన్ని నెలకొల్పిందని గ్రామస్తులు అభినందించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి