Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:53 AM

పసుమాముల–కళానగర్‌లో ఎన్ఎస్ఎస్ శీతాకాల ప్రత్యేక శిబిరాల ప్రారంభం

పసుమాముల–కళానగర్‌లో ఎన్ఎస్ఎస్ శీతాకాల ప్రత్యేక శిబిరాల ప్రారంభం

పసుమాముల–కళానగర్‌లో ఎన్ఎస్ఎస్ శీతాకాల ప్రత్యేక శిబిరాల ప్రారంభం
January 02, 2026 07:27 PM 57 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

హయత్ నగర్ స్థానిక ప్రతినిధి

పసుమాముల, కళానగర్ గ్రామాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్ ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో శీతాకాల ప్రత్యేక శిబిరాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కళాశాల ప్రిన్సిపల్ డా. పి. సురేష్‌బాబు శిబిరాలను ప్రారంభించి మాట్లాడారు. ఎన్ఎస్ఎస్ యూనిట్–1 వాలంటీర్లు కళానగర్‌లో, యూనిట్–2 వాలంటీర్లు పసుమాముల గ్రామంలో జనవరి 8 వరకు ఏడు రోజులపాటు నివసిస్తూ గ్రామస్తుల సహకారంతో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ప్రజాప్రతినిధి కొత్త జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, సేవాభావంతో గ్రామానికి వచ్చిన కళాశాల వాలంటీర్లకు గ్రామం తరపున పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.

శిబిర ప్రారంభ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాబురావు, కళాశాల అకాడమీ కోఆర్డినేటర్ బి. నరసింహ, అధ్యాపకులు రమాదేవి, సుబ్రహ్మణ్యం, శ్రీపతి నాయుడు, నాగరాజు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు యాదగిరి రెడ్డి, శారదా దేవి, స్థానికులు బిక్షపతి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్ల ఉత్సాహం గ్రామాల్లో సేవా వాతావరణాన్ని నెలకొల్పిందని గ్రామస్తులు అభినందించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News