PRINT TIME: March 23, 2026 02:40 AM
పాస్ కోసం విద్యార్థి వేడుకోలు.. సోషల్ మీడియాలో వైరల్ లేఖ
పాస్ కోసం విద్యార్థి వేడుకోలు.. సోషల్ మీడియాలో వైరల్ లేఖ
March 23, 2026 01:12 AM
17 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
అచ్చంపేట: ఇంటర్ విద్యార్థి తనను పాస్ చేయాలని వేడుకుంటూ రాసిన ఉత్తరం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ‘నాకు అమ్మానాన్న లేరు.. చదువు కూడా బాగా రాలేదు.. పేపర్ మూల్యాంకనం చేసే గురువులారా మీ కాళ్లు మొక్కుతా.. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా.. ఆ దేవుడు మీరే’ అంటూ భావోద్వేగంతో లేఖ రాశాడు.
ఈ లేఖలో గురువుకు దండం పెడుతున్నట్లుగా బొమ్మ కూడా గీయడం అందరినీ కదిలిస్తోంది. విద్యార్థి పరిస్థితిపై నెటిజన్లు స్పందిస్తూ, అతనికి న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఈ ఘటన ఏ జిల్లాలో జరిగిందన్నది స్పష్టంగా తెలియకపోయినా, ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి