Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:26 PM

పరిశుభ్రతే ఆరోగ్యానికి పునాది చిట్యాల మున్సిపాలిటీలో అవగాహన ర్యాలీ

పరిశుభ్రతే ఆరోగ్యానికి పునాది చిట్యాల మున్సిపాలిటీలో అవగాహన ర్యాలీ

పరిశుభ్రతే ఆరోగ్యానికి పునాది  చిట్యాల మున్సిపాలిటీలో అవగాహన ర్యాలీ
March 09, 2026 06:04 PM 110 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చిట్యాల మున్సిపాలిటీ చైర్మన్ పందిరి గీత ప్రజలకు పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీలో ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ప్రజాపాలన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సోమవారం మూడో వార్డులో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు.

వీధుల్లో పేరుకుపోయిన చెత్తను మున్సిపల్ సిబ్బందితో కలిసి సేకరించి చెత్త వాహనాలలో తరలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దోమల వ్యాప్తి వంటి సమస్యలను నివారించాలంటే ప్రజలు తమ చుట్టుపక్కల ప్రదేశాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యకరమైన జీవనానికి దోహదపడతాయని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మూడో వార్డు వనిపాకాల రోడ్ నుండి శ్రీరామ్ నగర్ కాలనీ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ ద్వారా పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి, కమిషనర్ దండు శ్రీను, కౌన్సిలర్లు, అంగన్వాడీ సిబ్బంది, విబీకేలు, మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News