Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:17 PM

పరిశుభ్రతే ఆరోగ్యానికి పునాది చిట్యాల మున్సిపాలిటీలో అవగాహన ర్యాలీ

పరిశుభ్రతే ఆరోగ్యానికి పునాది చిట్యాల మున్సిపాలిటీలో అవగాహన ర్యాలీ

పరిశుభ్రతే ఆరోగ్యానికి పునాది  చిట్యాల మున్సిపాలిటీలో అవగాహన ర్యాలీ
March 09, 2026 06:04 PM 106 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చిట్యాల మున్సిపాలిటీ చైర్మన్ పందిరి గీత ప్రజలకు పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీలో ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ప్రజాపాలన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సోమవారం మూడో వార్డులో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు.

వీధుల్లో పేరుకుపోయిన చెత్తను మున్సిపల్ సిబ్బందితో కలిసి సేకరించి చెత్త వాహనాలలో తరలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దోమల వ్యాప్తి వంటి సమస్యలను నివారించాలంటే ప్రజలు తమ చుట్టుపక్కల ప్రదేశాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యకరమైన జీవనానికి దోహదపడతాయని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మూడో వార్డు వనిపాకాల రోడ్ నుండి శ్రీరామ్ నగర్ కాలనీ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ ద్వారా పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి, కమిషనర్ దండు శ్రీను, కౌన్సిలర్లు, అంగన్వాడీ సిబ్బంది, విబీకేలు, మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News