Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బోగారం గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 03:53 PM

పారిశ్రామిక రసాయన శాస్త్రం అనుభవం.. నాగార్జున కళాశాల విద్యార్థుల క్షేత్ర ప్రయాణం.

పారిశ్రామిక రసాయన శాస్త్రం అనుభవం.. నాగార్జున కళాశాల విద్యార్థుల క్షేత్ర ప్రయాణం.

పారిశ్రామిక రసాయన శాస్త్రం అనుభవం.. నాగార్జున కళాశాల విద్యార్థుల క్షేత్ర ప్రయాణం.
February 04, 2026 04:35 PM 70 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

పారిశ్రామిక రసాయన శాస్త్రం అనుభవం.. నాగార్జున కళాశాల విద్యార్థుల క్షేత్ర ప్రయాణం.

నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వ) రసాయన శాస్త్ర విభాగ ఆధ్వర్యంలో డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థులు ఆర్మాల బాలి ప్రాంతంలో నెలకొల్పబడిన నిధి పివిసి పైపుల తయారీ పరిశ్రమను బుధవారం సందర్శించారు. ఈ క్షేత్రపర్యటనలో భాగంగా విద్యార్థులు పైపుల తయారీలో ఉన్న వివిధ దశలను యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమ అధికారులు విద్యార్థుల సందేహలను నివృత్తి చేయడం జరిగింది. తరగతి గదుల్లో నేర్చుకున్న సిద్ధాంతపరమైన అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించే లక్ష్యంతో ఈ పర్యటనను ఏర్పాటు చేశామని రసాయనశాస్త్ర విభాగం అధ్యక్షులు డా. అంతటి శ్రీనివాస్ అన్నారు. పరిశ్రమలో పనిచేసే సాంకేతిక నిపుణులు పైపుల తయారీ ప్రక్రియను వివరించారు. విద్యార్థులు రెసిన్ (Resin) మరియు ఇతర రసాయనాలను ఏ నిష్పత్తిలో కలుపుతారో పరిశీలించారు.మిశ్రమం వేడి చేయబడి, మెషిన్ ద్వారా పైపు ఆకారాన్ని ఎలా పొందుతుందో ఉత్పాదక ప్రక్రియ చూశారు. తయారైన పైపుల దృఢత్వాన్ని, నాణ్యతను (Quality Control) పరీక్షించే విధానాలను నిపుణులు వివరించారు. వ్యర్థాల నిర్వహణ మరియు పర్యావరణానికి హాని కలగకుండా పరిశ్రమ తీసుకుంటున్న జాగ్రత్తల గురించి విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు.ఈ పర్యటన విద్యార్థులకు ఎంతో విజ్ఞానదాయకంగా ఉందని, పారిశ్రామిక రంగంపై అవగాహన పెంచుకోవడానికి ఇలాంటి సందర్శనలు దోహదపడతాయని ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ తెలిపారు. క్షేత్రపర్యటనలో

వైస్ ప్రిన్సిపాల్ డా॥పరంగి రవికుమార్, డా|| బి. వెంకటేశ్వర్లు విద్యార్థులు పాల్గొన్నారు .

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News