పరిశ్రమలకు సకాలంలో అనుమతులు ఇవ్వాలి
పరిశ్రమలకు సకాలంలో అనుమతులు ఇవ్వాలి
Biksham
సూర్యాపేట జిల్లాలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు సకాలంలో అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల స్థాపనకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఒకే కేంద్ర విధానం ద్వారా అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాలో 36 పరిశ్రమలకు సంబంధించి 63 అనుమతులు వివిధ శాఖల ద్వారా వచ్చాయని, వాటిని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం ఆమోదించాలని సూచించారు.
పరిశ్రమల అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించిన ప్రత్యేక పథకం కింద 82 యూనిట్లను మంజూరు చేసినట్లు తెలిపారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ప్రధాన అధికారి టి సీతారాం, వాణిజ్య పన్నుల అధికారి బి యాదగిరి, జిల్లా పంచాయతీ అధికారి కె యాదగిరి, ఎస్సీ అభివృద్ధి అధికారి దయానంద రాణి, ఎస్టీ అభివృద్ధి అధికారి కె శంకర్, ఫ్యాక్టరీల పరిశీలకురాలు శ్రీదేవి తదితర అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి