Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:54 PM

పరిగి చెరువు కట్ట సమీపంలో లారీ బోల్తా – ప్రమాదం తప్పిన ఇద్దరు

పరిగి చెరువు కట్ట సమీపంలో లారీ బోల్తా – ప్రమాదం తప్పిన ఇద్దరు

పరిగి చెరువు కట్ట సమీపంలో లారీ బోల్తా – ప్రమాదం తప్పిన ఇద్దరు
April 09, 2026 12:34 PM 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని పరిగి చెరువు కట్ట కింద ఉన్న పన్నాడమ్మా దేవాలయం సమీపంలో గురువారం ఓ లారీ బోల్తా పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వరి తవుడు లోడుతో హిందూపురం వైపు వెళ్తున్న ఈ లారీ, రహదారి మలుపు వద్ద అకస్మాత్తుగా అదుపు తప్పి పక్కకు తిరిగింది. లారీలో అధిక లోడ్ ఉండటం వల్ల బ్యాలెన్స్ కోల్పోయినట్లు తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి స్థానికులు అప్రమత్తమై ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎవరికీ గాయాలు కాకపోవడం ఉపశమనకర విషయం.

ప్రాథమిక సమాచారం ప్రకారం, మలుపు వద్ద వేగం తగ్గించకపోవడం, అలాగే అధిక లోడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, రహదారి భద్రతపై అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News