పరిగి చెరువు కట్ట సమీపంలో లారీ బోల్తా – ప్రమాదం తప్పిన ఇద్దరు
పరిగి చెరువు కట్ట సమీపంలో లారీ బోల్తా – ప్రమాదం తప్పిన ఇద్దరు
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని పరిగి చెరువు కట్ట కింద ఉన్న పన్నాడమ్మా దేవాలయం సమీపంలో గురువారం ఓ లారీ బోల్తా పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వరి తవుడు లోడుతో హిందూపురం వైపు వెళ్తున్న ఈ లారీ, రహదారి మలుపు వద్ద అకస్మాత్తుగా అదుపు తప్పి పక్కకు తిరిగింది. లారీలో అధిక లోడ్ ఉండటం వల్ల బ్యాలెన్స్ కోల్పోయినట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే అక్కడి స్థానికులు అప్రమత్తమై ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎవరికీ గాయాలు కాకపోవడం ఉపశమనకర విషయం.
ప్రాథమిక సమాచారం ప్రకారం, మలుపు వద్ద వేగం తగ్గించకపోవడం, అలాగే అధిక లోడ్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, రహదారి భద్రతపై అధికారులు దృష్టి సారించాలని కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి