Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:35 PM

ప్రెస్ కాలనీ లో శ్రీ చైత్ర హైస్కూల్ నూతన బ్రాంచ్ ప్రారంభం**

ప్రెస్ కాలనీ లో శ్రీ చైత్ర హైస్కూల్ నూతన బ్రాంచ్ ప్రారంభం**

ప్రెస్ కాలనీ లో శ్రీ చైత్ర హైస్కూల్ నూతన బ్రాంచ్ ప్రారంభం**
March 23, 2026 12:51 AM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

:ప్రాంతీయ విద్యా రంగంలో మరో కీలక అడుగు ముందుకు పడింది. శ్రీ చైత్ర హైస్కూల్ నూతన బ్రాంచ్‌ను ఆదివారం చంపాపేట్ ప్రెస్ కాలనీ లో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజల సమక్షంలో ఉత్సాహభరితంగా జరిగింది.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఐఎస్ సదన్ డివిజన్ తాజా,మాజీ కార్పొరేటర్ జంగం శ్వేతా మధుకర్ రెడ్డి, సైదాబాద్ డివిజన్ తాజా,మాజీ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై బిబ్బన్ కట్ చేసి ఘనంగా నూతన బ్రాంచ్‌ను ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులతో కలిసి స్కూల్‌ను పరిశీలించి, విద్యా సదుపాయాలను అభినందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండటం అత్యంత అవసరమని తెలిపారు. ముఖ్యంగా మధ్య తరగతి, పేద కుటుంబాలకు తక్కువ ఫీజులతో ఉత్తమ విద్యను అందించడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయవచ్చని పేర్కొన్నారు. ఈ దిశగా శ్రీ చైత్ర హైస్కూల్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు.

శ్రీ చైత్ర స్కూల్ తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించుకుని, తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తూ సామాన్య ప్రజలకు చేరువైన విద్యాసంస్థగా ఎదిగిందని తెలిపారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తూ దినదినాభివృద్ధి సాధిస్తున్న ఈ విద్యాసంస్థ ప్రెస్ కాలనీలో మరో బ్రాంచ్‌ను ప్రారంభించడం ఆనందదాయకమని అన్నారు.

ఈ కార్యక్రమంలో పౌండర్, మానేజింగ్ డైరెక్టర్ అక్షయ్ కుమార్, డైరెక్టర్ శిరీష, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా నిర్వాహకులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News