ప్రేమ పేరుతో మహిళా కానిస్టేబుల్ను మోసం చేసిన ఎస్ ఐ ..!
ప్రేమ పేరుతో మహిళా కానిస్టేబుల్ను మోసం చేసిన ఎస్ ఐ ..!
Editor Desk
కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
ఎస్సై సురేష్ కుమార్ సస్పెండ్
2018 బ్యాచ్కు చెందిన ఎస్సై సురేష్ కుమార్ ప్రస్తుతం కొల్లూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారినట్లు సమాచారం.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతికి మరింత దగ్గరైన ఎస్సై.. కొంతకాలం తర్వాత పెళ్లి విషయంపై ఒత్తిడి రావడంతో తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.
ఇటీవల పెళ్లి అంశంపై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. తనను మోసం చేస్తున్నాడని అనుమానించిన మహిళా కానిస్టేబుల్ గట్టిగా నిలదీయగా.. ఎస్సై సురేష్ పెళ్లి సాధ్యం కాదని తేల్చి చెప్పినట్లు తెలిసింది.
దీంతో బాధితురాలు కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సురేష్ను విచారించేందుకు ప్రయత్నించగా.. అతను ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి అందుబాటులో లేకపోయినట్లు సమాచారం.
బాధితురాలు సమర్పించిన ఆధారాల ఆధారంగా ఉన్నతాధికారులు ఎస్సై సురేష్ కుమార్ను సస్పెండ్ చేసినట్లు తెలిసింది.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి