Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:42 PM

ప్రేమ కరుణతో సర్వం సుసాధ్యం

ప్రేమ కరుణతో సర్వం సుసాధ్యం

ప్రేమ కరుణతో సర్వం సుసాధ్యం
April 03, 2026 06:44 PM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు

రెవరెండ్ ఫాదర్ కస్పారెడ్డి

సూర్యాపేట జిల్లా ప్రేమ కరుణ సహనంతో సర్వం సుసాధ్యం చేయవచ్చని నిరూపించిన ఏకైక వ్యక్తి యేసు ప్రభువు అని సూర్యాపేట ఆర్సీఎం చర్చ్ ఫాదర్ రెవరెండ్ కస్పారెడ్డి పేర్కొన్నారు. పరిశుద్ధ శుక్రవారం (గుడ్ ఫ్రైడే) సందర్భంగా శుక్రవారం సూర్యాపేట లోని నిర్మల చర్చి ఆధ్వర్యంలో సిలువ దారి ఏసుక్రీస్తు చివరి రోజులను నాటక రూపంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని నిర్మల చర్చ వద్ద ప్రారంభమైన పరిశుద్ధ సిలువ మార్గం కార్యక్రమం అంబేద్కర్ బొమ్మ, శంకర్ విలాస్, గాంధీ బొమ్మ, ఆకారపు సుదర్శన్ బొమ్మ నుండి నిర్మల ఆసుపత్రిలోని కల్వరికొండ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు మరణానికి సంబంధించిన 14 గుర్తులను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కస్పారెడ్డి మాట్లాడుతూ... ప్రపంచ మానవాళిని పాపముల నుండి విముక్తులు చేసేందుకు క్రీస్తు ప్రభువు సిలువపై మరణం పొందాడని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు పాపాల నుండి విముక్తులు కావాలని సూచించారు. ఏసుప్రభువు కల్మషం లేకుండా జీవించి శారీరకంగా మరణించినా తిరిగి పునరుత్థానుడయ్యారని తెలిపారు. ప్రజలు యేసు ప్రభువు చూపిన మార్గంలో పయనిస్తూ తోటి వారి పట్ల ప్రేమానురాగాలను కలిగి, క్షమాగుణం ఆప్యాయత అనురాగాలను కలిగి ఉండాలన్నారు. చెడు వ్యసనాలను త్యజించి ప్రభు చూపించిన సన్మార్గం మార్గంలో నడవాలని ఆకాంక్షించారు. అనంతరం సాయంత్రం ఆర్.సి.యం చర్చిలో సిలువ ముద్దు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇతర ఫాదర్ లు, నిర్మల సిస్టర్స్, ఏ వి యం సిస్టర్స్, కాన్సిల్ మెంబెర్స్ ముక్కలా మర్రెడ్డి, వల్లమల్ల బాలాస్వామి, పిండిగ అజయ్, నాగటి ఏసుదాసు, బంధ శ్యాంసన్, పట్టేటి బాలశౌరి, పాండురంగీ బాలరాజు, గోపికిరణ్, కతోలిక విశ్వాసులు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News