PRINT TIME: March 16, 2026 03:12 AM
పరీక్ష రాసేందుకు వెళుతుండగా రోడ్డు ప్రమాదం
పరీక్ష రాసేందుకు వెళుతుండగా రోడ్డు ప్రమాదం
March 14, 2026 03:56 PM
16 Views
స్థానికం ప్రతినిధి :
వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh
కోటి ఆశలతో పదవ తరగతి పరీక్షలు రాయడానికి స్కూటీపై వెళ్తున్న విద్యార్థికి ఆటో ఢీకొని తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని రెడ్లరేపాక గ్రామ శివారులో జరిగింది. 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం పహిల్వాన్పూర్ గ్రామానికి చెందిన వనగంటి శివరాం శనివారం రోజున పదవ తరగతి పరీక్షలకు హాజరు కావడానికి తన స్కూటీపై వలిగొండ కు పరీక్ష సెంటర్ కు చేరుకోవడానికి రెడ్ల రేపాక మీదుగా వెళుతుండగా ఎదురుగా వచ్చిన ఆటో డీ కొట్టడంతో శివరాంకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందించగా అంబులెన్స్ లో భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి