Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 05:16 AM

పరేడ్ గ్రౌండ్స్‌లో అట్టహాసంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

పరేడ్ గ్రౌండ్స్‌లో అట్టహాసంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

పరేడ్ గ్రౌండ్స్‌లో అట్టహాసంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
January 26, 2026 11:13 AM 55 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లా స్థానికం ప్రతినిధి బిక్షం

జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్స్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. జాతీయ పతాకావిష్కరణతో ప్రారంభమైన ఈ కార్యక్రమం దేశభక్తి భావాలతో నిండిపోయింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, విద్యార్థులు, మహిళలు, స్థానిక ప్రజలు వేల సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, పిసిసి ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు పాల్గొని జాతీయ పతాకానికి వందనం చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులను స్మరించుకుని ఘన నివాళులు అర్పించారు.

వక్తలు తమ సందేశంలో భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అని పేర్కొన్నారు. సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం అనే విలువలపై దేశం నిలబడిందని అన్నారు. రాజ్యాంగ ఆత్మను కాపాడుకోవడం ప్రతి పౌరుడి ధర్మమని స్పష్టం చేశారు.

దేశ ప్రగతిలో రైతులు, కార్మికులు, పేదలు కీలక పాత్ర పోషిస్తున్నారని, వారి సంక్షేమమే నిజమైన అభివృద్ధి అని తెలిపారు. యువత విద్యతో పాటు దేశభక్తి, సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరూ చురుకుగా పాల్గొనాలని సూచించారు.వేడుకలలో భాగంగా విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించి అలరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు పరేడ్ గ్రౌండ్స్‌ను ఉత్సాహంతో నింపాయి. జాతీయ పతాకాల అలంకరణలతో మైదానం సర్వాంగసుందరంగా మారింది.ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News