Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 10, 2026 11:10 PM

పర్యావరణహిత పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

పర్యావరణహిత పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

పర్యావరణహిత పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్
February 11, 2026 05:15 PM 302 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలక పరిధిలోని లింగోజిగూడెం లో ఏర్పాటు చేసిన పర్యావరణహిత పోలింగ్ కేంద్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది జిల్లా కలెక్టర్ వి హనుమంతరావు మంగళవారం కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. హరిత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చేసిన చర్యలను అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగ మాత్రమే కాకుండా పర్యావరణానికి మేలు చేసే విధంగా నిర్వహించాలనే లక్ష్యంతో ఈ వినూత్న ప్రయోగం చేపట్టామని తెలిపారు. ప్లాస్టిక్ రహిత వాతావరణం కాగితం వస్త్ర బ్యానర్లు, జూటు సంచుల వినియోగం, తాగునీటి కోసం మట్టి కుండలు ఏర్పాటు వంటి చర్యలు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇలాంటి హరిత చర్యలు అమలు చేయాలని దిశగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేంద్రం ప్రాంగణంలో మొక్కలు నాటడం, ఓటర్లకు నీడనిచ్చేలా పచ్చ కవచాలు ఏర్పాటు చేయడం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే పోస్టర్లు ప్రదర్శించడం విశేషంగా నిలిచాయి.

ప్రజాస్వామ్య పండుగకు పచ్చని పరిమళం..

ఓటర్లకు గ్రీన్ మెసేజ్ అందేలా ప్రత్యేకంగా అలంకరించడం ఆకట్టుకుందని పేర్కొన్నారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు. వీల్ చైర్లు, రాంపులు, ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీటి సౌకర్యం, విశ్రాంతి ప్రదేశం వంటి ఏర్పాట్లను ప్రశంసించారు. సిబ్బంది సమయపాలన, ఓటర్లకు అందిస్తున్న సహకారం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. పర్యావరణహిత ఏర్పాట్లపై ఓటర్లు కూడా సానుకూలంగా స్పందించారు. ఇలాంటి కేంద్రాల్లో ఓటు వేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రజాస్వామ్య పండుగకు పచ్చని పరిమళం అద్దిన ఈ వినూత్న ప్రయత్నం చౌటుప్పల్ ఎన్నికలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఓటు హక్కుతో పాటు ప్రకృతి పరిరక్షణ బాధ్యతను గుర్తుచేసిన ఈ చర్య రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తుందని కలెక్టర్ వి. హనుమంతరావు పేర్కొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News