Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:23 PM

ప్రయాణికులను కాపాడిన బస్సు డ్రైవర్

ప్రయాణికులను కాపాడిన బస్సు డ్రైవర్

ప్రయాణికులను కాపాడిన బస్సు డ్రైవర్
January 26, 2026 05:49 PM 121 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాద ఘటన – 50 మంది ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవర్

యాదాద్రి భువనగిరి జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ మియాపూర్ నుంచి విజయవాడకు వెళ్తున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బస్సు డ్రైవర్ హార్ట్ స్ట్రోక్‌తో మృతి చెందాడు. అయితే, చివరి క్షణాల వరకూ తన ప్రాణాల కంటే బస్సులో ప్రయాణిస్తున్న 50 మంది ప్రయాణికుల భద్రతకే ప్రాధాన్యం ఇచ్చి మానవతా విలువలకు నిదర్శనంగా నిలిచాడు.

బస్సు అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతానికి చేరుకున్న సమయంలో డ్రైవర్‌కు ఛాతిలో నొప్పి ప్రారంభమైంది. సాధారణ నొప్పి అని భావించిన ఆయన బస్సును చౌటుప్పల్ వరకు నడిపించాడు. నొప్పి తీవ్రత పెరగడంతో హార్ట్ స్ట్రోక్‌గా గుర్తించాడు. ఆ సమయంలో హైదరాబాద్‌లోని ఆస్పత్రికి వెళ్లాలంటే సుమారు 30 కిలోమీటర్ల దూరం ఉండటంతో, ప్రయాణికుల భద్రత దృష్ట్యా బస్సును వెనక్కి తీసుకెళ్లే సాహసం చేయలేదు.

చౌటుప్పల్ వద్ద బస్సును సురక్షితంగా నిలిపివేసి, సమీపంలోని ఆస్పత్రికి వెళ్లిన వెంటనే ఆయన కుప్పకూలిపోయాడు. అప్పటికే డ్రైవర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడిని విజయవాడకు చెందిన నాగరాజుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

డ్రైవర్ అత్యవసర పరిస్థితిలో బస్సును అధిక వేగంతో నడిపి ఉంటే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉండేదని ప్రయాణికులు పేర్కొన్నారు. తన ప్రాణాలు కోల్పోయినా, 50 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన నాగరాజు త్యాగం ప్రశంసనీయం అని స్థానికులు, ప్రయాణికులు భావవ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News