ప్రయాణికుడి నిజాయితీకి నిదర్శనంగా నిలిచిన ఆర్టీసీ సిబ్బంది
ప్రయాణికుడి నిజాయితీకి నిదర్శనంగా నిలిచిన ఆర్టీసీ సిబ్బంది
Editor Desk
చిట్యాల స్థానికం ప్రతినిధి రిపోర్టర్ ప్రశాంత్
భువనగిరి నుంచి చిట్యాల వైపు వస్తున్న 3297 నంబర్ గల ఆర్టీసీ బస్సులో పేరేపెల్లి గ్రామానికి చెందిన ఇద్దయ్య అనే ప్రయాణికుడు భువనగిరిలో షాపింగ్ చేశాడు. షాపింగ్ చేసిన బట్టల బ్యాగులో విలువైన పత్రాలు కూడా ఉండగా, చిట్యాల వద్ద బస్సు దిగే సమయంలో ఆ బ్యాగును బస్సులోనే మరిచిపోయాడు.తర్వాత తన బ్యాగు మర్చిపోయిన విషయాన్ని గమనించిన ఇద్దయ్య చిట్యాల టీజీఎస్ ఆర్టీసీ కార్గో నిర్వాహకులను సంప్రదించాడు. 이에 స్పందించిన ఆర్టీసీ కార్గో నిర్వాహకుడు పొలిమేర దశరథ, నార్కట్పల్లి ఆర్టీసీ కంట్రోలర్ పి.బి. చారికి సమాచారం అందించారు.బస్సు నంబర్ తెలియజేయడంతో, నార్కట్పల్లి డిపోకు చేరుకున్న బస్సులో సిబ్బంది శోధించి బ్యాగును గుర్తించారు.అనంతరం నార్కట్పల్లికి వచ్చిన ప్రయాణికుడు ఇద్దయ్యకు, కంట్రోలర్ పి.బి. చారి బ్యాగును సురక్షితంగా అప్పగించారు. తన విలువైన వస్తువులు తిరిగి లభించడంతో ఇద్దయ్య ఆనందం వ్యక్తం చేస్తూ ఆర్టీసీ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి