PRINT TIME: April 10, 2026 02:18 AM
పర్వతాపురంలో బాధిత కుటుంబానికి కృష్ణా మిల్క్ యూనియన్ 50 వేల రూపాయలు అందజేత
పర్వతాపురంలో బాధిత కుటుంబానికి కృష్ణా మిల్క్ యూనియన్ 50 వేల రూపాయలు అందజేత
February 15, 2026 08:38 AM
144 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
తిరువూరు క్లస్టర్ పరిధిలో చాట్రాయి మండలం పర్వతాపురం పాల సంఘం నందు పాడి రైతు బి. కృష్ణకుమారి మరణించగా కృష్ణా మిల్క్ యూనియన్ అందించే క్షిర బందు పథకం నకు అర్హులు అయినందున వారి భర్త అయిన బి. తాతయ్య కి 50,000/ - చెక్కును సంఘ అధ్యక్షురాలు మిద్దె శైలజ తిరువూరు క్లస్టర్ మేనేజర్ పి ప్రసాద్ లు అందజేశారు. ఆపద సమయంలో బాధలో ఉండగా కృష్ణా మిల్క్ యూనియన్ వారు 50,000 రూపాయలు ఇచ్చినందుకు కృష్ణ మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు కి మరియు పాలక వర్గ సభ్యులకు బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ పాలకవర్గ సభ్యులు , గ్రామ పెద్దలు, సర్పంచ్ మిద్దె శివాజీ, రూట్ సూపర్వైజర్ బి. నరసింహారావు, వేతన కార్యదర్శి పి.నారాయణ రావు , పాడి రైతులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి