Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:01 AM

ప్రతి వార్డ్ సమాన అభివృద్ధే లక్ష్యం – యువనేత సాగర్ శెట్కార్

ప్రతి వార్డ్ సమాన అభివృద్ధే లక్ష్యం – యువనేత సాగర్ శెట్కార్

ప్రతి వార్డ్ సమాన అభివృద్ధే లక్ష్యం – యువనేత సాగర్ శెట్కార్
February 21, 2026 03:26 PM 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా 15వ వార్డ్‌లో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను యువనేత సాగర్ శెట్కార్ స్వయంగా పరిశీలించారు. ప్రాంత ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు అందించాలనే సంకల్పంతో ఈ పనులు నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ జరుగుతున్నాయా అనే దానిపై ప్రత్యేక దృష్టి సారించారు.ఈ కార్యక్రమంలో బీసీ సెల్ అధ్యక్షుడు సాయిలు పటేల్, మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాహిర్ అలీ, మాజీ ఎంపీటీసీ ముంతాజ్, 15వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థి అసిఫ్ తదితర నాయకులు పాల్గొన్నారు. వారు పనుల పురోగతిని సమీక్షించి, పనుల నాణ్యత మరింత మెరుగుపడేలా సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.ఈ సందర్భంగా యువనేత సాగర్ శెట్కార్ మాట్లాడుతూ, “ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడం మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ప్రతి వార్డ్ సమానంగా అభివృద్ధి చెందాలి. మంచి రహదారులు, శుభ్రమైన వాతావరణం, సమగ్ర సౌకర్యాలు కల్పించడం ద్వారా నారాయణఖేడ్ మున్సిపల్‌ను ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతాం” అని తెలిపారు.స్థానిక ప్రజలు కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలను హర్షిస్తూ, రహదారి నిర్మాణం పూర్తయిన తరువాత రాకపోకలు సులభతరం అవుతాయని, ప్రాంతీయ అభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు.15వ వార్డ్‌లో జరుగుతున్న ఈ సీసీ రోడ్డు పనులు పూర్తయ్యాక ప్రాంతం మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News