ప్రతి పుట్టినరోజుకు ఒక మొక్కను నాటాలి
ప్రతి పుట్టినరోజుకు ఒక మొక్కను నాటాలి
Komidala Mahender reddy
నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చిన్ననారాయనపురం గ్రామానికి చెందిన సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాల & జూనియర్ కళాశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని కొమ్ము రేణుశ్రీ తన పుట్టినరోజును సామాజిక బాధ్యతతో జరుపుకున్నారు.
సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించి, అందరికీ సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే సంకల్పంతో ఆమె తన పుట్టినరోజు సందర్భంగా ఒక పూల మొక్కను పాఠశాల ఆవరణలో నాటారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శమంతకమణి, PET జ్యోతి, తల్లిదండ్రులు కొమ్ము యాదగిరి – రమణలు పాల్గొని విద్యార్థినిని అభినందించారు.
ఈ సందర్భంగా రేణుశ్రీ మాట్లాడుతూ, “ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు సందర్భంగా కనీసం ఒక మొక్కను నాటితే సమాజం మరింత అందంగా, ఆరోగ్యంగా మారుతుంది” అని తెలిపారు. తన పుట్టినరోజును పర్యావరణ పరిరక్షణకు అంకితం చేయడం తనకు ఎంతో సంతృప్తినిస్తోందని అన్నారు.
విద్యార్థిని చేసిన ఈ చక్కటి కార్యక్రమం అందరికీ ఆదర్శంగా నిలుస్తోందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రశంసించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి