ప్రతి పేద కుటుంబానికి సొంతింటి లక్ష్యం
ప్రతి పేద కుటుంబానికి సొంతింటి లక్ష్యం
K.RAVI
ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన చైర్పర్సన్ పావని రమేష్ గౌడ్
చౌటుప్పల్ బంగారిగడ్డ మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో యండి పర్వీన్, యస్కే ఫరీన్ నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చౌటుప్పల్ మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ గోశిక వినయ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభోత్సవం నిర్వహించారు.ఈ సందర్భంగా చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.ఈ కార్యక్రమంలో 20వ వార్డు కౌన్సిలర్ యండి హన్నుబాయ్, 17వ వార్డు కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు, షాదీ ఖానా చైర్మన్ ఎస్కే కరీం, కో-ఆప్షన్ సభ్యులు యండి బాబా షరీఫ్, యస్కే జానిబాబు, సందగళ్ల విజయ సతీష్, పస్తం గంగారాములు, షాదీ ఖానా మాజీ చైర్మన్ ఎండి ఎజాస్ పాషా, ఎండి ఇబ్రహీం, 20వ వార్డు అధ్యక్షులు ఉడుగు వెంకటేశం గౌడ్, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు యండి చోటే బాయ్, యండి వాహిద్, మిరియాల సునీత, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి