ప్రతి ఒక్క రైతు ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ నందు పేరు నమోదు చేయించుకోవాలి ఏలూరు జిల్లా రిసోర్స్ సెంటర్ ఏవో ఉషాకుమారి, ఎమ్ ఏ వో శివశంకర్
ప్రతి ఒక్క రైతు ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ నందు పేరు నమోదు చేయించుకోవాలి ఏలూరు జిల్లా రిసోర్స్ సెంటర్ ఏవో ఉషాకుమారి, ఎమ్ ఏ వో శివశంకర్
GADDAM JAGANMOHAN REDDY
చాట్రాయి జనవరి 21 (స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని వ్యవసాయ భూమి కలిగి ఉన్న రైతులు అందరూ రైతు సేవ కేంద్రం ద్వారా APFR నందు ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ నందు పేరును నమోదు చేయించుకోవడం వలన రైతు యొక్క భూమి వివరాలు సర్వే నంబర్లు ఈ పంట వివరములు, అన్నదాత సుఖీభవ, ఇతర పథకములు పీఎం కిసాన్ అన్నియు ఒక విశిష్ట గుర్తింపు పై రైతుకు తెలుస్తుందని రైతులకు చిత్తపూరు గ్రామం నందు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్క రైతు ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడం వలన రైతులకు వ్యవసాయ శాఖ చేయు కార్యక్రమాలు తెలుస్తాయని డిస్టిక్ రిసోర్స్ సెంటర్ ,ఏలూరు ఏవో ఎమ్ .ఉషా కుమారి తెలియజేశారు. మొక్కజొన్నలో యాజమాన్య పద్ధతులు, నీటి యాజమాన్య పద్ధతులు,మిత్ర పురుగుల సంరక్షణ గురించి పొలం పిలుస్తుంది కార్యక్రమంలో వివరించారు. ఈ కార్యక్రమమునకు చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ మరియు ఉద్యానన సహాయకులు సుబ్బారావు, రైతులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి