Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:57 PM

ప్రతి ఒక్క రైతు ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ నందు పేరు నమోదు చేయించుకోవాలి ఏలూరు జిల్లా రిసోర్స్ సెంటర్ ఏవో ఉషాకుమారి, ఎమ్ ఏ వో శివశంకర్

ప్రతి ఒక్క రైతు ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ నందు పేరు నమోదు చేయించుకోవాలి ఏలూరు జిల్లా రిసోర్స్ సెంటర్ ఏవో ఉషాకుమారి, ఎమ్ ఏ వో శివశంకర్

ప్రతి ఒక్క రైతు ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ నందు పేరు నమోదు చేయించుకోవాలి ఏలూరు జిల్లా రిసోర్స్ సెంటర్ ఏవో ఉషాకుమారి, ఎమ్ ఏ వో  శివశంకర్
January 21, 2026 08:36 PM 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి జనవరి 21 (స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి) ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని వ్యవసాయ భూమి కలిగి ఉన్న రైతులు అందరూ రైతు సేవ కేంద్రం ద్వారా APFR నందు ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ నందు పేరును నమోదు చేయించుకోవడం వలన రైతు యొక్క భూమి వివరాలు సర్వే నంబర్లు ఈ పంట వివరములు, అన్నదాత సుఖీభవ, ఇతర పథకములు పీఎం కిసాన్ అన్నియు ఒక విశిష్ట గుర్తింపు పై రైతుకు తెలుస్తుందని రైతులకు చిత్తపూరు గ్రామం నందు తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్క రైతు ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడం వలన రైతులకు వ్యవసాయ శాఖ చేయు కార్యక్రమాలు తెలుస్తాయని డిస్టిక్ రిసోర్స్ సెంటర్ ,ఏలూరు ఏవో ఎమ్ .ఉషా కుమారి తెలియజేశారు. మొక్కజొన్నలో యాజమాన్య పద్ధతులు, నీటి యాజమాన్య పద్ధతులు,మిత్ర పురుగుల సంరక్షణ గురించి పొలం పిలుస్తుంది కార్యక్రమంలో వివరించారు. ఈ కార్యక్రమమునకు చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ మరియు ఉద్యానన సహాయకులు సుబ్బారావు, రైతులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News