ప్రతి కుటుంబానికి సొంతింటే లక్ష్యం
ప్రతి కుటుంబానికి సొంతింటే లక్ష్యం
K.RAVI
ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో చైర్పర్సన్ పావని రమేష్ గౌడ్
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో కడెం మధు ఐశ్వర్య నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును బుధవారం చౌటుప్పల్ మున్సిపల్ చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో చౌటుప్పల్ మున్సిపాలిటీలోని ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని అన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్, మున్సిపాలిటీ అధ్యక్షుడు సుర్వి నర్సింహా గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చేవగోని వెంకటేశం, వర్గాల రవి, తోర్పునూరి నరసింహ గౌడ్, తోర్పునూరి రవి గౌడ్, జంగయ్య, వెంకటేష్, శివ, బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి