Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బోదాస్ ఐలయ్య కుమార్తె నిశ్చితార్థంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిజిటల్‌ సభ్యత్వ నమోదుకు బీఆర్‌ఎస్‌ శ్రీకారం. ఎర్రవెల్లిలో కేసీఆర్‌తో కీలక సమావేశం సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 13, 2026 05:58 PM

ప్రతి కుటుంబానికి సొంతింటే లక్ష్యం

ప్రతి కుటుంబానికి సొంతింటే లక్ష్యం

ప్రతి కుటుంబానికి సొంతింటే లక్ష్యం
May 13, 2026 04:35 PM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో కడెం మధు ఐశ్వర్య నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును బుధవారం చౌటుప్పల్ మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో చౌటుప్పల్ మున్సిపాలిటీలోని ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని అన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ గౌడ్, మున్సిపాలిటీ అధ్యక్షుడు సుర్వి నర్సింహా గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చేవగోని వెంకటేశం, వర్గాల రవి, తోర్పునూరి నరసింహ గౌడ్, తోర్పునూరి రవి గౌడ్, జంగయ్య, వెంకటేష్, శివ, బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News