Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:42 AM

ప్రత్యామ్నాయం సోషలిజమే కొలిశెట్టి యాదగిరిరావు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు

ప్రత్యామ్నాయం సోషలిజమే కొలిశెట్టి యాదగిరిరావు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు

ప్రత్యామ్నాయం సోషలిజమే   కొలిశెట్టి యాదగిరిరావు సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు
February 21, 2026 07:11 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

ప్రపంచంలో ఉన్న దేశాలు స్వతంత్రత సార్వభౌమత్వం కలిగి ఉండాలని ఉద్దేశంతో వివిధ దేశాలు తాము రచించుకున్న రాజ్యాంగం ప్రకారం నడుస్తుంటే ఓర్వలేని అమెరికా సామ్రాజ్యవాదం తన గుత్తాధిపత్యం కోసం వివిధ దేశాల మీద దాడులు చేసి ఆ దేశంలో ఉన్న ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ సామ్రాజ్యవాద విధానాన్ని చాటుకుంటుందని దాని అడ్డుకోవడం సోషలిజం వల్లనే అవుతుందని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు అన్నారు కమ్యూనిస్టు ప్రణాళిక ఆవిర్భావ దినోత్సవం ఫిబ్రవరి 21వ రోజున రెడ్ బుక్కు డే జరుపుకోవడం ఆనవాయితీగా ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో బలితెగించిన అమెరికా సామ్రాజ్యవాదం అనే పుస్తక పఠనం బోధించిన సందర్భంగా ఆయన మాట్లాడారు అమెరికా తన ఆధిపత్యం కోసం చిన్న దేశాలైన వెనిజులా అధ్యక్షున్ని అతని భార్యను బంధించి ఆదేశ సార్వభౌమత్వాన్ని నాశనం చేశాడని విమర్శించారు వెనుజులా దేశంలో చమురు ఎగుమతిని వివిధ దేశాలకు తక్కువ సుంకంతో అందిస్తున్నాడని ఆదివారం లేక తాను చెప్పినట్లు ఆ దేశ అధ్యక్షుడు వినాలని నిర్ణయాన్ని విభేదించిన అదే శాధ్యక్షుని బంధించడం హేయమైన చర్యాని అన్నారు మన దేశానికి కూడా శుంకాలను పెంచి రష్యా దేశం నుంచి దిగుమతి చేయకుండా అమెరికా దేశం నుండి దిగుమతి చేయాలని షరతులు పెట్టిన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ అతనికి వత్తాసుగా అగ్రిమెంట్ చేసుకున్నాడని విమర్శించారు ఇజ్రాయిల్ దేశం గాజా పై దాడులను ప్రోత్సహించి ఆ దేశ భౌతిక స్వరూపం పై తీవ్రమైన దెబ్బతీశాడని అనేకమంది ప్రాణాలు పోగొట్టుకున్నారని ముఖ్యమైన నగరాలు దగ్ధమయాయని దీనికంతటికి అమెరికా కారణమని అన్నారు ఇటీవల కాలంలో ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు వివిధ దేశాల అంతర్గత విషయాలలో భద్రతా విషయాలలో జోక్యం చేసుకొని తన పెత్తనం ఆదేశాలపై రుద్దుతున్నాడని అన్నారు అందుకే సామ్రాజ్యవాద విధానానికి వ్యతిరేకంగా సోషలిస్టు దేశాలైన రష్యా క్యూబా ఉత్తరకొరియా దేశాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ముందు నిలుస్తున్నాయని అన్నారు ఐక్యరాజ్యసమితిలో అమెరికా పెత్తనం చెలాయిస్తూ తన గుత్తాధిపత్యం నడవాలని చూస్తుందని అన్నారు

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బుర్ర శ్రీనివాసు, కందాల శంకర్ రెడ్డి ,మండల కార్యదర్శిలు వజ్జే శ్రీనివాసు, దేవరకొండ యాదగిరి ,,మాజీ జడ్పిటిసి తాటి విజయమ్మ, మండల కమిటీ సభ్యులు దేవరాజు ఉప్పుల సోమయ్య ,బోనాల వెంకన్న, వచ్చే సైదులు, యాదగిరి, చంద్రయ్య, జనార్ధన్ ,తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News