Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వన మహోత్సవంలో మొక్కలు నాటిన సర్పంచ్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 04:31 PM

ప్రతి విద్యార్థి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి...

ప్రతి విద్యార్థి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి...

ప్రతి విద్యార్థి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి...
31-12-2025 54 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఖేడ్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి మంథని శ్రీధర్

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి: నారాయణఖేడ్ నియోజకవర్గంలో నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖేడ్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి శ్రీ మంథని శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, విద్యార్ధి దశ అత్యంత కీలకమని పేర్కొన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి, చదువుపై శ్రద్ధ వహించాలని, తల్లిదండ్రులు మరియు గురువులను గౌరవించాలని సూచించారు. ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకొని, ఉన్నత లక్ష్యాలను సాధించాలని ప్రోత్సహించారు.తోటి విద్యార్థుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, ఏదైనా వేధింపులు ఎదురైతే 1098 లేదా 100 నంబర్లకు కాల్ చేసి సహాయం పొందవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రతి విద్యార్థి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి...

Article Image

ఖేడ్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి మంథని శ్రీధర్

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి: నారాయణఖేడ్ నియోజకవర్గంలో నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖేడ్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి శ్రీ మంథని శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, విద్యార్ధి దశ అత్యంత కీలకమని పేర్కొన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి, చదువుపై శ్రద్ధ వహించాలని, తల్లిదండ్రులు మరియు గురువులను గౌరవించాలని సూచించారు. ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకొని, ఉన్నత లక్ష్యాలను సాధించాలని ప్రోత్సహించారు.తోటి విద్యార్థుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, ఏదైనా వేధింపులు ఎదురైతే 1098 లేదా 100 నంబర్లకు కాల్ చేసి సహాయం పొందవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News