Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 12:38 AM

ప్రతి విద్యార్థి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి...

ప్రతి విద్యార్థి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి...

ప్రతి విద్యార్థి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి...
December 31, 2025 08:19 PM 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sangareddy & Manoor
Sthanikam District Staff Reporter krishna

ఖేడ్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి మంథని శ్రీధర్

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి: నారాయణఖేడ్ నియోజకవర్గంలో నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఖేడ్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి శ్రీ మంథని శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.


ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, విద్యార్ధి దశ అత్యంత కీలకమని పేర్కొన్నారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండి, చదువుపై శ్రద్ధ వహించాలని, తల్లిదండ్రులు మరియు గురువులను గౌరవించాలని సూచించారు. ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకొని, ఉన్నత లక్ష్యాలను సాధించాలని ప్రోత్సహించారు.తోటి విద్యార్థుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, ఏదైనా వేధింపులు ఎదురైతే 1098 లేదా 100 నంబర్లకు కాల్ చేసి సహాయం పొందవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News