ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ప్రక్రియ
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ప్రక్రియ
Biksham
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ .
సూర్యాపేట, హుజూర్నగర్, కోదాడ, తిరుమలగిరి, నేరేడుచర్లమున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగు తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.
బుధవారం సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో జడ్పి ఉన్నత పాఠశాల, ఆనంద్ విద్యా మందిర్ హై స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తేజ్ హై స్కూల్, చుక్కారామయ్య హై స్కూల్, కుడకుడలోని ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి సందర్శించి ఏర్పాట్లు, ఓటింగ్ విధానాన్ని పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చి, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అనంతరం సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సముదాయ సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ను సందర్శించి వెబ్కాస్టింగ్ ప్రక్రియను పరిశీలించారు.పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా కొనసాగుతున్నదని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, తహసీల్దార్ కృష్ణయ్య, ఎన్నికల సిబ్బంది ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి