Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 05:29 AM

ప్రశాంత ఎన్నికలే లక్ష్యం – కలెక్టర్ హనుమంత రావు

ప్రశాంత ఎన్నికలే లక్ష్యం – కలెక్టర్ హనుమంత రావు

ప్రశాంత ఎన్నికలే లక్ష్యం – కలెక్టర్ హనుమంత రావు
February 10, 2026 04:26 PM 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించాలి

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11న జరిగే పోలింగ్ ప్రక్రియను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు సూచించారు. పోలింగ్ ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశించారు.మంగళవారం చౌటుప్పల్, పోచంపల్లిలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియను, భోజన వసతులు, ఇతర ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేశారు.

డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో సిబ్బందికి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలని తెలిపారు. లైటింగ్, త్రాగునీరు, లంచ్, డిన్నర్ ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండాలని, పోలింగ్ సిబ్బందిని బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లతో పోలింగ్ కేంద్రాలకు ఎస్కార్ట్ వాహనాల ద్వారా తరలించాలని సూచించారు. బ్యాలెట్ బాక్సులు సరిగా ఉన్నాయా లేవా అని ముందుగా పరిశీలించి మాత్రమే సిబ్బందికి అప్పగించాలని తెలిపారు.జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో పకడ్బందీగా పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ వెల్లడించారు. పోలింగ్ సిబ్బంది కూడా తమకు కేటాయించిన సామగ్రిని డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలోనే పూర్తిగా పరిశీలించి జాగ్రత్తగా పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లాలని సూచించారు.

పోలింగ్ ప్రక్రియ రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభించాల్సిందిగా తెలిపారు. ఈరోజు రాత్రికే అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఓటర్లు కూడా ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలో వంద శాతం ఓటింగ్ నమోదు కావాలని ఆకాంక్షించారు.

ప్రతి పోలింగ్ స్టేషన్‌లో జరుగుతున్న పోలింగ్ తీరును నిశితంగా పరిశీలించాలని, ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు తదితర అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News