Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ మండలి చైర్మన్ నేతి విద్యాసాగర్ పెనుకొండలో బీసీ విద్యార్థులకు వరం.. కొత్తగా 3 హాస్టళ్లు మంజూరు బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 09, 2026 08:02 AM

ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సులు

ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సులు

ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సులు
May 08, 2026 08:33 PM 16 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తలసేమియా బాధిత చిన్నారులకు అండగా నిలవాలి : చింతకాయల రేఖ

నల్గొండ, : తలసేమియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, బాధిత చిన్నారులకు అండగా నిలవడం తమ ముఖ్య ఉద్దేశ్యమని అమ్మ ఫౌండేషన్ ఫౌండర్ చింతకాయల రేఖ పేర్కొన్నారు. ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ ప్రభుత్వ జనరల్ మెడికల్ కాలేజీ, బ్లడ్ సెంటర్లలో తాసుబెల్లి ఫౌండేషన్, అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తలసేమియా అనేది వంశపారంపర్య రక్త సంబంధిత వ్యాధి అని తెలిపారు. ఈ వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల్లో ఎర్ర రక్త కణాలు సరిగా ఉత్పత్తి కాకపోవడంతో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గి తీవ్రమైన రక్తహీనత ఏర్పడుతుందని చెప్పారు. అలాంటి పిల్లలకు జీవితాంతం ప్రతి నెలా రక్త మార్పిడి అవసరమవుతుందని వివరించారు.

వివాహానికి ముందు దంపతులు “HbA2” అనే రక్త పరీక్ష చేయించుకుంటే పుట్టబోయే బిడ్డకు తలసేమియా రాకుండా ముందస్తుగా నివారించవచ్చని సూచించారు.

తలసేమియా వ్యాధిని 1925లో అమెరికాకు చెందిన శిశురోగ నిపుణులు డాక్టర్ థామస్ బెంటన్ కూలీ, డాక్టర్ పెరల్ లీ గుర్తించగా, 1932లో నోబెల్ బహుమతి గ్రహీతలు జార్జ్ విప్పల్, విలియం బ్రాడ్‌ఫోర్డ్ ఈ వ్యాధికి “తలసేమియా” అని పేరు పెట్టినట్లు తెలిపారు.

కార్యక్రమంలో డీఎంహెచ్‌వో సంపత్ మాట్లాడుతూ తలసేమియా చిన్నారుల కోసం తాసుబెల్లి ఫౌండేషన్, అమ్మ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సంస్థలు చేపడుతున్న సేవా కార్యక్రమాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో తాసుబెల్లి ఫౌండేషన్ చైర్మన్ శంకర్ నాయుడు, గోపరాజు శ్రీనివాస్, సౌబిండి వెంకటలక్ష్మి, సాయి సేవా ట్రస్ట్ ఫౌండర్ దాసరి సాయి, కో-ఫౌండర్ బలికే రాకేష్ కుమార్, అమ్మ ఫౌండేషన్ సభ్యుడు సురేష్, ఐసిటీసీ కౌన్సిలర్ లింగస్వామి, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News