Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:53 AM

ప్రపంచీకరణ పేరుతో జరిగే విధ్వంసాన్ని ఆపాలి

ప్రపంచీకరణ పేరుతో జరిగే విధ్వంసాన్ని ఆపాలి

ప్రపంచీకరణ పేరుతో జరిగే విధ్వంసాన్ని ఆపాలి
December 08, 2025 05:32 AM 165 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ సాహితీ సంస్థ రాష్ట్ర కార్యదర్శి ఆనందాచారి

స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

నేడు ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ ల పేరుతో మానవ సంబంధాల మధ్య జరిగే విద్వేషాలను నిరోధించుటకు "తెలంగాణ సాహితీ సంస్థ" కృషి చేయాలని తెలంగాణ సాహితీ సంస్థ రాష్ట్ర కార్యదర్శి కె ఆనందాచారి కోరారు. ఆదివారం భువనగిరి పట్టణ శివారులోని తెలంగాణ హోటల్ లో జరిగిన యాదాద్రి భువనగిరి జిల్లా "తెలంగాణ సాహితీ సంస్థ ఆవిర్భావ" సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నేటి పాలకులు దేశంలో ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ పేరుతో మన సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగలు , తినే తిండిని మార్చివేసి , వస్తువుల వినిమయం పెంచారని ఆయన అన్నారు. ప్రపంచీకరణ అనేది పేదవాన్ని దోచుకోవడానికి, కార్పొరేట్ సంస్థలను బలోపేతం చేయడానికే ఉపయోగపడుతున్నాయని ఆయన అన్నారు. పాలకులు సనాతన ధర్మం పేరుతో అంటరానితనం , అస్పృశ్యత ను పెంచి పోషించాలని చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థల కారణంగా నేటి యువత ఉద్యోగం, భద్రత కోసం రోజుకు 14 గంటలు పని చేస్తున్నారని, ఇలాంటి శ్రమ దోపిడీ , విష సంసృతి, సాంప్రదాయాలు మారాలని, కవులు కళాకారులు, రచయితలు, సాహితీవేత్తలు, సామాజిక కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ సాహితీ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ బాధ్యులు జిట్టా భాస్కర్ రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు గోవర్థన్, సభ్యులు ఏభూషి నర్సింహ, మధు మోహన్, హనుమంతు, కొడారి వెంకటేష్, ముత్తి రెడ్డి, వెంకన్న , ఉప్పలయ్య, రాజేందర్, నాగభూషణం , ముత్యాలు, రాజు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News