Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:44 AM

ప్రపంచీకరణ పేరుతో జరిగే విధ్వంసాన్ని ఆపాలి

ప్రపంచీకరణ పేరుతో జరిగే విధ్వంసాన్ని ఆపాలి

ప్రపంచీకరణ పేరుతో జరిగే విధ్వంసాన్ని ఆపాలి
December 08, 2025 05:32 AM 52 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ సాహితీ సంస్థ రాష్ట్ర కార్యదర్శి ఆనందాచారి

స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

నేడు ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ ల పేరుతో మానవ సంబంధాల మధ్య జరిగే విద్వేషాలను నిరోధించుటకు "తెలంగాణ సాహితీ సంస్థ" కృషి చేయాలని తెలంగాణ సాహితీ సంస్థ రాష్ట్ర కార్యదర్శి కె ఆనందాచారి కోరారు. ఆదివారం భువనగిరి పట్టణ శివారులోని తెలంగాణ హోటల్ లో జరిగిన యాదాద్రి భువనగిరి జిల్లా "తెలంగాణ సాహితీ సంస్థ ఆవిర్భావ" సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నేటి పాలకులు దేశంలో ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ పేరుతో మన సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగలు , తినే తిండిని మార్చివేసి , వస్తువుల వినిమయం పెంచారని ఆయన అన్నారు. ప్రపంచీకరణ అనేది పేదవాన్ని దోచుకోవడానికి, కార్పొరేట్ సంస్థలను బలోపేతం చేయడానికే ఉపయోగపడుతున్నాయని ఆయన అన్నారు. పాలకులు సనాతన ధర్మం పేరుతో అంటరానితనం , అస్పృశ్యత ను పెంచి పోషించాలని చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థల కారణంగా నేటి యువత ఉద్యోగం, భద్రత కోసం రోజుకు 14 గంటలు పని చేస్తున్నారని, ఇలాంటి శ్రమ దోపిడీ , విష సంసృతి, సాంప్రదాయాలు మారాలని, కవులు కళాకారులు, రచయితలు, సాహితీవేత్తలు, సామాజిక కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ సాహితీ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ బాధ్యులు జిట్టా భాస్కర్ రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు గోవర్థన్, సభ్యులు ఏభూషి నర్సింహ, మధు మోహన్, హనుమంతు, కొడారి వెంకటేష్, ముత్తి రెడ్డి, వెంకన్న , ఉప్పలయ్య, రాజేందర్, నాగభూషణం , ముత్యాలు, రాజు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News