ప్రపంచీకరణ పేరుతో జరిగే విధ్వంసాన్ని ఆపాలి
ప్రపంచీకరణ పేరుతో జరిగే విధ్వంసాన్ని ఆపాలి
Editor Desk
తెలంగాణ సాహితీ సంస్థ రాష్ట్ర కార్యదర్శి ఆనందాచారి
స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
నేడు ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ ల పేరుతో మానవ సంబంధాల మధ్య జరిగే విద్వేషాలను నిరోధించుటకు "తెలంగాణ సాహితీ సంస్థ" కృషి చేయాలని తెలంగాణ సాహితీ సంస్థ రాష్ట్ర కార్యదర్శి కె ఆనందాచారి కోరారు. ఆదివారం భువనగిరి పట్టణ శివారులోని తెలంగాణ హోటల్ లో జరిగిన యాదాద్రి భువనగిరి జిల్లా "తెలంగాణ సాహితీ సంస్థ ఆవిర్భావ" సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నేటి పాలకులు దేశంలో ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ పేరుతో మన సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగలు , తినే తిండిని మార్చివేసి , వస్తువుల వినిమయం పెంచారని ఆయన అన్నారు. ప్రపంచీకరణ అనేది పేదవాన్ని దోచుకోవడానికి, కార్పొరేట్ సంస్థలను బలోపేతం చేయడానికే ఉపయోగపడుతున్నాయని ఆయన అన్నారు. పాలకులు సనాతన ధర్మం పేరుతో అంటరానితనం , అస్పృశ్యత ను పెంచి పోషించాలని చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థల కారణంగా నేటి యువత ఉద్యోగం, భద్రత కోసం రోజుకు 14 గంటలు పని చేస్తున్నారని, ఇలాంటి శ్రమ దోపిడీ , విష సంసృతి, సాంప్రదాయాలు మారాలని, కవులు కళాకారులు, రచయితలు, సాహితీవేత్తలు, సామాజిక కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ సాహితీ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ బాధ్యులు జిట్టా భాస్కర్ రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు గోవర్థన్, సభ్యులు ఏభూషి నర్సింహ, మధు మోహన్, హనుమంతు, కొడారి వెంకటేష్, ముత్తి రెడ్డి, వెంకన్న , ఉప్పలయ్య, రాజేందర్, నాగభూషణం , ముత్యాలు, రాజు తదితరులు పాల్గొన్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి