Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:09 AM

ప్రమాదవశాత్తు కెమికల్ సేవించి వ్యక్తి మృతి

ప్రమాదవశాత్తు కెమికల్ సేవించి వ్యక్తి మృతి

ప్రమాదవశాత్తు కెమికల్ సేవించి వ్యక్తి మృతి
04-02-2026 518 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వాటర్ బాటిల్ అనుకొని కెమికల్ సేవించి వ్యక్తి మృతి చెందిన ఘటన చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామంలో చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చౌటుప్పల్ మండలం కైతాపురం గ్రామానికి చెందిన గుడ్డేటి రవి (43) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కెమికల్ సేవించి మృతి చెందాడు. ఖాళీగా ఉన్న సమయంలో మండల పరిధిలోని ఎల్లగిరి గ్రామంలోని కోళ్ల ఫారం షెడ్ లో రాత్రి డ్యూటీకి వెళ్లే రవి.మంగళవారం రాత్రి కూడా విధులకు హాజరయ్యాడు. బుధవారం తెల్లవారుజామున నిద్రలేచి వాటర్ బాటిల్ అనుకొని 'సర్మోలిన్' అనే కెమికల్ ద్రావణాన్ని పొరపాటున సేవించాడు. కొద్దిసేపటికి తీవ్ర కడుపు మంటగా ఉందని చెప్పడంతో అక్కడ ఉన్న సహోద్యోగులు అతడిని వెంటనే చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి రిఫర్ చేయగా, చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే రవి తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటనపై మృతుడి అన్న కొడుకు గుడ్డేటి లవ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కృష్ణ మాల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Sthanikam

ప్రమాదవశాత్తు కెమికల్ సేవించి వ్యక్తి మృతి

Article Image

వాటర్ బాటిల్ అనుకొని కెమికల్ సేవించి వ్యక్తి మృతి చెందిన ఘటన చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామంలో చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చౌటుప్పల్ మండలం కైతాపురం గ్రామానికి చెందిన గుడ్డేటి రవి (43) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కెమికల్ సేవించి మృతి చెందాడు. ఖాళీగా ఉన్న సమయంలో మండల పరిధిలోని ఎల్లగిరి గ్రామంలోని కోళ్ల ఫారం షెడ్ లో రాత్రి డ్యూటీకి వెళ్లే రవి.మంగళవారం రాత్రి కూడా విధులకు హాజరయ్యాడు. బుధవారం తెల్లవారుజామున నిద్రలేచి వాటర్ బాటిల్ అనుకొని 'సర్మోలిన్' అనే కెమికల్ ద్రావణాన్ని పొరపాటున సేవించాడు. కొద్దిసేపటికి తీవ్ర కడుపు మంటగా ఉందని చెప్పడంతో అక్కడ ఉన్న సహోద్యోగులు అతడిని వెంటనే చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి రిఫర్ చేయగా, చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే రవి తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటనపై మృతుడి అన్న కొడుకు గుడ్డేటి లవ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కృష్ణ మాల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News