ప్రమాదవశాత్తు కెమికల్ సేవించి వ్యక్తి మృతి
ప్రమాదవశాత్తు కెమికల్ సేవించి వ్యక్తి మృతి
K.RAVI
వాటర్ బాటిల్ అనుకొని కెమికల్ సేవించి వ్యక్తి మృతి చెందిన ఘటన చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామంలో చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చౌటుప్పల్ మండలం కైతాపురం గ్రామానికి చెందిన గుడ్డేటి రవి (43) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కెమికల్ సేవించి మృతి చెందాడు. ఖాళీగా ఉన్న సమయంలో మండల పరిధిలోని ఎల్లగిరి గ్రామంలోని కోళ్ల ఫారం షెడ్ లో రాత్రి డ్యూటీకి వెళ్లే రవి.మంగళవారం రాత్రి కూడా విధులకు హాజరయ్యాడు. బుధవారం తెల్లవారుజామున నిద్రలేచి వాటర్ బాటిల్ అనుకొని 'సర్మోలిన్' అనే కెమికల్ ద్రావణాన్ని పొరపాటున సేవించాడు. కొద్దిసేపటికి తీవ్ర కడుపు మంటగా ఉందని చెప్పడంతో అక్కడ ఉన్న సహోద్యోగులు అతడిని వెంటనే చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి రిఫర్ చేయగా, చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే రవి తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటనపై మృతుడి అన్న కొడుకు గుడ్డేటి లవ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కృష్ణ మాల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి