Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:23 PM

ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి కూలి మృతి

ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి కూలి మృతి

ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి  కూలి మృతి
March 18, 2026 05:53 PM 271 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామ శివారులో నిర్మాణ పనుల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన నారాయణ చంద్ర రాయ్ (43) గత రెండు నెలలుగా శ్రీ లక్ష్మి కన్స్ట్రక్షన్ కంపెనీ వద్ద కూలీగా పనిచేస్తున్నాడు.

ఈ నెల 13న సుమారు 12 అడుగుల ఎత్తులో తడకలపై గోడ పనులు చేస్తుండగా జారి కింద పడిపోయాడు. కింద ఉన్న ఐరన్ రాడ్ తలకు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే నార్కెట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

అయితే చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. మృతుడి బావ నితిన్ సర్కార్ ఫిర్యాదు మేరకు చిట్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News