PRINT TIME: May 26, 2026 05:23 PM
ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి కూలి మృతి
ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడి కూలి మృతి
March 18, 2026 05:53 PM
271 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామ శివారులో నిర్మాణ పనుల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్కు చెందిన నారాయణ చంద్ర రాయ్ (43) గత రెండు నెలలుగా శ్రీ లక్ష్మి కన్స్ట్రక్షన్ కంపెనీ వద్ద కూలీగా పనిచేస్తున్నాడు.
ఈ నెల 13న సుమారు 12 అడుగుల ఎత్తులో తడకలపై గోడ పనులు చేస్తుండగా జారి కింద పడిపోయాడు. కింద ఉన్న ఐరన్ రాడ్ తలకు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే నార్కెట్పల్లి కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
అయితే చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. మృతుడి బావ నితిన్ సర్కార్ ఫిర్యాదు మేరకు చిట్యాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి