Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:35 AM

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు వాడితే ఆరోగ్యం సురక్షితం ఇజ్జిగాని, మాదాసు

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు వాడితే ఆరోగ్యం సురక్షితం ఇజ్జిగాని, మాదాసు

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు వాడితే ఆరోగ్యం సురక్షితం ఇజ్జిగాని, మాదాసు
09-03-2026 47 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి : ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో మహిళా రైతు సాధికార ఏపీసీఎన్ ఆధ్వర్యంలో “ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వాడుదాం – ఆరోగ్యాన్ని కాపాడుకుందాం” అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ టిడిపి పార్టీ అధ్యక్షులు మాదాసు చిన్న పుల్లయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు మంచి స్పందన చూపారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చాట్రాయి టిడిపి మండల పార్టీ అధ్యక్షులు అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు హాజరై మాట్లాడుతూ రసాయనాల వినియోగం పెరుగుతున్న ఈ కాలంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా ప్రజలు అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చని తెలిపారు. రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించి ఆరోగ్యకరమైన ఆహారాన్ని సమాజానికి అందించాలని పిలుపునిచ్చారు.

మాదాసు చిన్న పుల్లయ్య మాట్లాడుతూ రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించడం వల్ల భూమి సారాన్ని కాపాడటంతో పాటు ప్రజలకు నాణ్యమైన ఆహారం అందుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి పార్టీ ప్రధాన కార్యదర్శి బలువూరు రత్తయ్య, ఎన్‌పీఎం అధికారి ప్రసన్న, ఏపీఎం వెంకటరత్నం, సీసీలు ప్రసాద్, స్వరూప, శ్రీనివాసరావు, హెచ్‌ఎల్‌పీఎం ఐఆర్‌ఓసీలు, మహిళా సాధికార రైతులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

Sthanikam

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు వాడితే ఆరోగ్యం సురక్షితం ఇజ్జిగాని, మాదాసు

Article Image

చాట్రాయి : ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో మహిళా రైతు సాధికార ఏపీసీఎన్ ఆధ్వర్యంలో “ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వాడుదాం – ఆరోగ్యాన్ని కాపాడుకుందాం” అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ టిడిపి పార్టీ అధ్యక్షులు మాదాసు చిన్న పుల్లయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు మంచి స్పందన చూపారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చాట్రాయి టిడిపి మండల పార్టీ అధ్యక్షులు అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు హాజరై మాట్లాడుతూ రసాయనాల వినియోగం పెరుగుతున్న ఈ కాలంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా ప్రజలు అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చని తెలిపారు. రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించి ఆరోగ్యకరమైన ఆహారాన్ని సమాజానికి అందించాలని పిలుపునిచ్చారు.

మాదాసు చిన్న పుల్లయ్య మాట్లాడుతూ రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించడం వల్ల భూమి సారాన్ని కాపాడటంతో పాటు ప్రజలకు నాణ్యమైన ఆహారం అందుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి పార్టీ ప్రధాన కార్యదర్శి బలువూరు రత్తయ్య, ఎన్‌పీఎం అధికారి ప్రసన్న, ఏపీఎం వెంకటరత్నం, సీసీలు ప్రసాద్, స్వరూప, శ్రీనివాసరావు, హెచ్‌ఎల్‌పీఎం ఐఆర్‌ఓసీలు, మహిళా సాధికార రైతులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News