ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు వాడితే ఆరోగ్యం సురక్షితం ఇజ్జిగాని, మాదాసు
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు వాడితే ఆరోగ్యం సురక్షితం ఇజ్జిగాని, మాదాసు
GADDAM JAGANMOHAN REDDY
చాట్రాయి : ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో మహిళా రైతు సాధికార ఏపీసీఎన్ ఆధ్వర్యంలో “ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వాడుదాం – ఆరోగ్యాన్ని కాపాడుకుందాం” అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ టిడిపి పార్టీ అధ్యక్షులు మాదాసు చిన్న పుల్లయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు మంచి స్పందన చూపారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చాట్రాయి టిడిపి మండల పార్టీ అధ్యక్షులు అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు హాజరై మాట్లాడుతూ రసాయనాల వినియోగం పెరుగుతున్న ఈ కాలంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా ప్రజలు అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చని తెలిపారు. రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించి ఆరోగ్యకరమైన ఆహారాన్ని సమాజానికి అందించాలని పిలుపునిచ్చారు.
మాదాసు చిన్న పుల్లయ్య మాట్లాడుతూ రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించడం వల్ల భూమి సారాన్ని కాపాడటంతో పాటు ప్రజలకు నాణ్యమైన ఆహారం అందుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి పార్టీ ప్రధాన కార్యదర్శి బలువూరు రత్తయ్య, ఎన్పీఎం అధికారి ప్రసన్న, ఏపీఎం వెంకటరత్నం, సీసీలు ప్రసాద్, స్వరూప, శ్రీనివాసరావు, హెచ్ఎల్పీఎం ఐఆర్ఓసీలు, మహిళా సాధికార రైతులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి