ప్రకృతి వ్యవసాయంపై మక్కువ చూపండి ఏవో బి. శివశంకర్ టిడిపి మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు
ప్రకృతి వ్యవసాయంపై మక్కువ చూపండి ఏవో బి. శివశంకర్ టిడిపి మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు
GADDAM JAGANMOHAN REDDY
చాట్రాయి స్ధానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి ఏలూరు జిల్లా, చాట్రాయి మండలం,చాట్రాయి గ్రామంలోని ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఆధ్వర్యంలో ఈరోజు ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ద్వారా NMNF గ్రామాలలో ప్రకృతి వ్యవసాయ అవగాహన కార్యక్రమాన్ని చాట్రాయి రైతు సేవ కేంద్రం లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతి రైతు తనకున్న భూమిలో కనీసం ఒక అర ఎకరం విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయాన్ని సాగు చేసి తన కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి బి శివ శంకర్ మాట్లాడుతూ సాగులో ప్రకృతి వ్యవసాయ పద్ధతులు అవలంబించాలని రైతులను కోరారు. ప్రకృతి వ్యవసాయ NFA రియాజ్ ప్రకృతి వ్యవసాయం దాని సాగు విధానం గురించి సభలో మాట్లాడడం జరిగింది . రైతులందరూ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల భూమి,వాతావరణం ఆరోగ్యంగా ఉంటాయని తెలియజేయడం జరిగింది, సందర్భంగా ప్రకృతి వ్యవసాయం పై మక్కువ చూపిన రైతులను సన్మానించారు ఈ కార్యక్రమంలో మండల సమైక్య అధికారి వెంకటేశ్వరావు, రాజకీయ నేతలు, రైతులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి