ప్రజావాణి ఫిర్యాదులపై వెంటనే చర్యలు
ప్రజావాణి ఫిర్యాదులపై వెంటనే చర్యలు
Biksham Goud
పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి : జిల్లా కలెక్టర్
సూర్యాపేట ప్రజావాణి కార్యక్రమంలో అందిన ఫిర్యాదులపై అధికారులు సత్వరమే చర్యలు తీసుకొని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. వివిధ శాఖల్లో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఫిర్యాదులపై శాఖల వారీగా ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయి ప్రజావాణిలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను కూడా త్వరితగతిన పరిష్కరించాలని పేర్కొన్నారు.
సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో భూ సమస్యలకు సంబంధించిన 48 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారికి సంబంధించిన 8, వైద్య ఆరోగ్య శాఖకు 7, గ్రామీణ అభివృద్ధి సంస్థకు 6, మిగిలిన 30 దరఖాస్తులు వివిధ శాఖలకు చెందినవిగా మొత్తం 99 దరఖాస్తులు స్వీకరించామని చెప్పారు. వాటిని శాఖల వారీగా పంపించి పరిష్కారానికి చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కే. సీతారామారావు, మహిళా శిశు సంక్షేమ అధికారి కే. నర్సింహారావు, డి ఎస్ సి డి ఓ కే. దయానంద రాణి, జిల్లా విద్యాశాఖ అధికారి ఆశోక్, గిరిజన సంక్షేమ అధికారి శంకర్, పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాస్ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి