Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లక్ష్య సాధనకు పట్టుదల అవసరం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 03:12 PM

ప్రజావాణి ఫిర్యాదులకు వేగవంతమైన పరిష్కారం – జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు: జిల్లా కలెక్టర్

ప్రజావాణి ఫిర్యాదులకు వేగవంతమైన పరిష్కారం – జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు: జిల్లా కలెక్టర్

ప్రజావాణి ఫిర్యాదులకు వేగవంతమైన పరిష్కారం – జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు: జిల్లా కలెక్టర్
February 23, 2026 05:22 PM 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా పరిపాలన విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో అందిన ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యంతో తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు.ప్రజల సమస్యల సత్వర పరిష్కారం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.మున్సిపల్ ఎన్నికల కారణంగా తాత్కాలికంగా నిలిపివేయబడిన ప్రజావాణి కార్యక్రమం సోమవారం నుంచి యథావిధిగా పునఃప్రారంభమైంది. జిల్లా కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజల నుండి పెద్ద సంఖ్యలో వినతులు స్వీకరించబడ్డాయి. ప్రజావాణి కార్యక్రమం ప్రజలకు ప్రభుత్వం అందించే నేరుగా వినతి సమర్పణ వేదికగా ఉండటంతో, దీనికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాధురి, డిప్యూటీ కలెక్టర్ ఉమా హారతి, జడ్పీ సీఈవో జానకి రెడ్డి, ఆర్డీఓలు రాజేందర్, దేవుజ తదితరులతో కలిసి కలెక్టర్ ప్రజల సమస్యలను స్వయంగా విన్నారు. మొత్తం 38 వినతులు అందగా, వాటిని సంబంధిత శాఖల అధికారులకు వెంటనే పంపించి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ఫిర్యాదుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం ఉండకూడదని, ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించాల్సిందిగా స్పష్టం చేశారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు సంబంధిత అధికారులు పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు. ప్రజల సమస్యల పట్ల సానుభూతితో స్పందిస్తూ పారదర్శకంగా వ్యవహరించాలన్నారు.ప్రజావాణిలో విద్య, వైద్య, రెవెన్యూ, మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగుల సంక్షేమం, గృహ నిర్మాణం, డీఆర్‌డీఓ, డీటీఓ, నీటిపారుదల, సర్వే & ల్యాండ్ రికార్డ్స్, బీసీ సంక్షేమం, పంచాయతీ రాజ్, మున్సిపల్ తదితర శాఖలకు సంబంధించిన ఫిర్యాదులు నమోదయ్యాయి.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతి సమస్యకు సమగ్ర పరిష్కారం చూపించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని కలెక్టర్ వెల్లడించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News