Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:52 AM

ప్రజావాణి అర్జీలు సత్వరమే పరిష్కరించాలి. అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు.

ప్రజావాణి అర్జీలు సత్వరమే పరిష్కరించాలి. అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు.

ప్రజావాణి అర్జీలు సత్వరమే పరిష్కరించాలి.  అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు.
08-06-2026 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన 72 అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఆలస్యం లేకుండా పరిష్కరించాలని సూచించారు.

అందిన అర్జీల్లో రెవెన్యూ శాఖకు అత్యధికంగా 48, మున్సిపాలిటీకి 7, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్‌కు 3, గ్రామీణాభివృద్ధి శాఖకు 3, పీడీ హౌసింగ్‌కు 3, సంక్షేమ శాఖకు 2 దరఖాస్తులు వచ్చాయి. వ్యవసాయ, ఇరిగేషన్, ఉపాధి కల్పన, విద్య, బీసీ వెల్ఫేర్, ఎస్సీ కార్పొరేషన్ శాఖలకు ఒక్కో దరఖాస్తు అందినట్లు అధికారులు తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, ఆర్డీవో శేఖర్‌రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజావాణి అర్జీలు సత్వరమే పరిష్కరించాలి. అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు.

Article Image

ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన 72 అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఆలస్యం లేకుండా పరిష్కరించాలని సూచించారు.

అందిన అర్జీల్లో రెవెన్యూ శాఖకు అత్యధికంగా 48, మున్సిపాలిటీకి 7, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్‌కు 3, గ్రామీణాభివృద్ధి శాఖకు 3, పీడీ హౌసింగ్‌కు 3, సంక్షేమ శాఖకు 2 దరఖాస్తులు వచ్చాయి. వ్యవసాయ, ఇరిగేషన్, ఉపాధి కల్పన, విద్య, బీసీ వెల్ఫేర్, ఎస్సీ కార్పొరేషన్ శాఖలకు ఒక్కో దరఖాస్తు అందినట్లు అధికారులు తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, ఆర్డీవో శేఖర్‌రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News