Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:19 AM

ప్రజావాణి అర్జీలు సత్వరమే పరిష్కరించాలి. అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు.

ప్రజావాణి అర్జీలు సత్వరమే పరిష్కరించాలి. అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు.

ప్రజావాణి అర్జీలు సత్వరమే పరిష్కరించాలి.  అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు.
June 08, 2026 06:08 PM 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన 72 అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఆలస్యం లేకుండా పరిష్కరించాలని సూచించారు.

అందిన అర్జీల్లో రెవెన్యూ శాఖకు అత్యధికంగా 48, మున్సిపాలిటీకి 7, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్‌కు 3, గ్రామీణాభివృద్ధి శాఖకు 3, పీడీ హౌసింగ్‌కు 3, సంక్షేమ శాఖకు 2 దరఖాస్తులు వచ్చాయి. వ్యవసాయ, ఇరిగేషన్, ఉపాధి కల్పన, విద్య, బీసీ వెల్ఫేర్, ఎస్సీ కార్పొరేషన్ శాఖలకు ఒక్కో దరఖాస్తు అందినట్లు అధికారులు తెలిపారు.

కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, ఆర్డీవో శేఖర్‌రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News