ప్రజావాణి అర్జీలు సత్వరమే పరిష్కరించాలి. అదనపు కలెక్టర్ భాస్కర్రావు.
ప్రజావాణి అర్జీలు సత్వరమే పరిష్కరించాలి. అదనపు కలెక్టర్ భాస్కర్రావు.
Editor Desk
ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి వివిధ ప్రాంతాల ప్రజల నుంచి వచ్చిన 72 అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఆలస్యం లేకుండా పరిష్కరించాలని సూచించారు.
అందిన అర్జీల్లో రెవెన్యూ శాఖకు అత్యధికంగా 48, మున్సిపాలిటీకి 7, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్కు 3, గ్రామీణాభివృద్ధి శాఖకు 3, పీడీ హౌసింగ్కు 3, సంక్షేమ శాఖకు 2 దరఖాస్తులు వచ్చాయి. వ్యవసాయ, ఇరిగేషన్, ఉపాధి కల్పన, విద్య, బీసీ వెల్ఫేర్, ఎస్సీ కార్పొరేషన్ శాఖలకు ఒక్కో దరఖాస్తు అందినట్లు అధికారులు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి, ఆర్డీవో శేఖర్రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి