Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 02:57 AM

ప్రజావాణి అర్జీలకు తక్షణ పరిష్కారం. కలెక్టర్‌ అనురాగ్ జయంతి

ప్రజావాణి అర్జీలకు తక్షణ పరిష్కారం. కలెక్టర్‌ అనురాగ్ జయంతి

ప్రజావాణి అర్జీలకు తక్షణ పరిష్కారం.   కలెక్టర్‌ అనురాగ్ జయంతి
18-05-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డితో కలిసి ప్రజల నుంచి వచ్చిన 51 అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సమయపాలనతో వ్యవహరించాలని తెలిపారు.

ప్రజావాణిలో రెవెన్యూ శాఖకు 32, హౌసింగ్‌కు 5, జిల్లా సంక్షేమ శాఖకు 3, మున్సిపాలిటీ, సర్వే ల్యాండ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలకు రెండేసి, పంచాయతీ, ఎక్సైజ్‌, ఇరిగేషన్‌, చేనేత జౌళి, జిల్లా పరిషత్ శాఖలకు ఒక్కొక్కటి చొప్పున దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు.

అనంతరం నిర్వహించిన సమీక్షలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రజావాణిలో వచ్చిన అర్జీలను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని సూచించారు.

కార్యక్రమంలో డీఆర్‌డీవో నాగిరెడ్డి, జడ్పీ సీఈవో శోభారాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజావాణి అర్జీలకు తక్షణ పరిష్కారం. కలెక్టర్‌ అనురాగ్ జయంతి

Article Image

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డితో కలిసి ప్రజల నుంచి వచ్చిన 51 అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సమయపాలనతో వ్యవహరించాలని తెలిపారు.

ప్రజావాణిలో రెవెన్యూ శాఖకు 32, హౌసింగ్‌కు 5, జిల్లా సంక్షేమ శాఖకు 3, మున్సిపాలిటీ, సర్వే ల్యాండ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలకు రెండేసి, పంచాయతీ, ఎక్సైజ్‌, ఇరిగేషన్‌, చేనేత జౌళి, జిల్లా పరిషత్ శాఖలకు ఒక్కొక్కటి చొప్పున దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు.

అనంతరం నిర్వహించిన సమీక్షలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రజావాణిలో వచ్చిన అర్జీలను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని సూచించారు.

కార్యక్రమంలో డీఆర్‌డీవో నాగిరెడ్డి, జడ్పీ సీఈవో శోభారాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News