ప్రజావాణి అర్జీలకు తక్షణ పరిష్కారం. కలెక్టర్ అనురాగ్ జయంతి
ప్రజావాణి అర్జీలకు తక్షణ పరిష్కారం. కలెక్టర్ అనురాగ్ జయంతి
Editor Desk
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డితో కలిసి ప్రజల నుంచి వచ్చిన 51 అర్జీలను స్వీకరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సమయపాలనతో వ్యవహరించాలని తెలిపారు.
ప్రజావాణిలో రెవెన్యూ శాఖకు 32, హౌసింగ్కు 5, జిల్లా సంక్షేమ శాఖకు 3, మున్సిపాలిటీ, సర్వే ల్యాండ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు రెండేసి, పంచాయతీ, ఎక్సైజ్, ఇరిగేషన్, చేనేత జౌళి, జిల్లా పరిషత్ శాఖలకు ఒక్కొక్కటి చొప్పున దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు.
అనంతరం నిర్వహించిన సమీక్షలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రజావాణిలో వచ్చిన అర్జీలను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని సూచించారు.
కార్యక్రమంలో డీఆర్డీవో నాగిరెడ్డి, జడ్పీ సీఈవో శోభారాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి