ప్రజాసేవకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు.డల్లాస్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్న భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె. రాజ్కుమార్ రెడ్డి
ప్రజాసేవకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు.డల్లాస్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్న భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె. రాజ్కుమార్ రెడ్డి
Editor Desk
నారాయణపేట, జూన్ 6 :
ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా, సామాజిక సేవనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె. రాజ్కుమార్ రెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా అమెరికాలోని డల్లాస్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసింది.
ఈ అవార్డును శనివారం హైదరాబాద్లోని ఆబిడ్స్లో జరిగిన కార్యక్రమంలో అందజేశారు. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ రాజ్కుమార్ రెడ్డికి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా రాజ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తాను జన్మించిన ప్రాంత అభివృద్ధే తన జీవిత లక్ష్యమని పేర్కొన్నారు. భీష్మరాజ్ ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, వైద్య సేవలు, తాగునీటి సదుపాయాలు, విద్యా ప్రోత్సాహక కార్యక్రమాలు, దేవాలయాల అభివృద్ధి వంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
నారాయణపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలుస్తూ వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రజల మన్ననలు, ఆశీస్సులే తనకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
అమెరికా డల్లాస్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకోవడం ఆనందంగా ఉందని, ఈ గౌరవంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని రాజ్కుమార్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి నారాయణపేట జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
జిల్లా ప్రజల ఆర్థిక, సామాజిక అభివృద్ధే తన లక్ష్యమని, నియోజకవర్గానికి శాశ్వత పరిష్కారాలు అందించే దిశగా సేవలు కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి