ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
K.RAVI
మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రామిరెడ్డి
చౌటప్పుల్ పట్టణం ఓటర్లలో చైతన్యం నింపేందుకు చేపట్టిన స్వీప్ కార్యక్రమంలో భాగంగా నేడు మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని సహాయ జిల్లా ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రామిరెడ్డి ప్రారంభించారు.మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ తంగడిపల్లి రోడ్డు చౌరస్తా మీదుగా నాగులకుంట జంక్షన్ కు చేరుకుంది. అక్కడ విద్యార్థులు, మహిళా సంఘాలు, మున్సిపల్ సిబ్బందితో కలిసి భారీ మానవ హారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ అందరితో కలిసి ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. కుల, మత, జాతి విభేదాలకు అతీతంగా,ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేస్తామని అందరూ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ర్యాలీ ప్రభుత్వ ఆసుపత్రి మీదుగా సాగి తిరిగి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుంది.కమిషనర్ మాట్లాడుతూ మున్సిపాలిటీలోని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, ఆర్.ఓ.అంజయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, పర్యావరణ ఇంజనీర్ రేణు కుమార్, వార్డ్ ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, పారిశుద్ధ్య సిబ్బంది, ఎలక్ట్రిషియన్లు, వాటర్మెన్ లు, మహిళా సంఘం రిసోర్స్ పర్సన్స్, మహిళా సంఘం సభ్యులు, ట్రినిటీ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి