Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:55 PM

ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి

ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి

ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి
February 07, 2026 07:47 PM 133 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రామిరెడ్డి

చౌటప్పుల్ పట్టణం ఓటర్లలో చైతన్యం నింపేందుకు చేపట్టిన స్వీప్ కార్యక్రమంలో భాగంగా నేడు మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని సహాయ జిల్లా ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రామిరెడ్డి ప్రారంభించారు.మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ తంగడిపల్లి రోడ్డు చౌరస్తా మీదుగా నాగులకుంట జంక్షన్ కు చేరుకుంది. అక్కడ విద్యార్థులు, మహిళా సంఘాలు, మున్సిపల్ సిబ్బందితో కలిసి భారీ మానవ హారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ అందరితో కలిసి ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. కుల, మత, జాతి విభేదాలకు అతీతంగా,ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేస్తామని అందరూ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ర్యాలీ ప్రభుత్వ ఆసుపత్రి మీదుగా సాగి తిరిగి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుంది.కమిషనర్ మాట్లాడుతూ మున్సిపాలిటీలోని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, ఆర్.ఓ.అంజయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, పర్యావరణ ఇంజనీర్ రేణు కుమార్, వార్డ్ ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, పారిశుద్ధ్య సిబ్బంది, ఎలక్ట్రిషియన్లు, వాటర్మెన్ లు, మహిళా సంఘం రిసోర్స్ పర్సన్స్, మహిళా సంఘం సభ్యులు, ట్రినిటీ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News