“ప్రజలను మోసం చేసిన బడ్జెట్”
“ప్రజలను మోసం చేసిన బడ్జెట్”
K.RAVI
గ్యారంటీల అమలులో వైఫల్యం: సుర్కంటి శ్రీధర్ రెడ్డి మందోళ్ల గూడెం ఉపసర్పంచ్
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన బడ్జెట్గా నిలిచిందని మందోళ్ల గూడెం ఉపసర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ చౌటుప్పల్ మండల అధికార ప్రతినిధి సుర్కంటి శ్రీధర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వృద్ధులకు పెన్షన్లు పెంచడం, కొత్తగా వితంతు పింఛన్లు మంజూరు చేయడం, రైతులకు రైతుబంధు అమలు చేయడం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందించడం వంటి కీలక అంశాలకు నిధులు లేవని ప్రభుత్వం చెబుతూనే, మరోవైపు సీఎం, మంత్రుల కార్యక్రమాల పేరుతో వేల కోట్ల ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారని ఆరోపించారు.కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు కాకుండా అటకెక్కిపోయాయని, ప్రజలను మభ్యపెట్టే విధంగా బడ్జెట్ రూపొందించారని అన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవర్తన కూడా తగిన విధంగా లేదని విమర్శించారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను కొనసాగించకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యేలు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి