Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:08 AM

“ప్రజలను మోసం చేసిన బడ్జెట్”

“ప్రజలను మోసం చేసిన బడ్జెట్”

“ప్రజలను మోసం చేసిన బడ్జెట్”
22-03-2026 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

గ్యారంటీల అమలులో వైఫల్యం: సుర్కంటి శ్రీధర్ రెడ్డి మందోళ్ల గూడెం ఉపసర్పంచ్

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన బడ్జెట్‌గా నిలిచిందని మందోళ్ల గూడెం ఉపసర్పంచ్, బీఆర్‌ఎస్ పార్టీ చౌటుప్పల్ మండల అధికార ప్రతినిధి సుర్కంటి శ్రీధర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వృద్ధులకు పెన్షన్లు పెంచడం, కొత్తగా వితంతు పింఛన్లు మంజూరు చేయడం, రైతులకు రైతుబంధు అమలు చేయడం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించడం వంటి కీలక అంశాలకు నిధులు లేవని ప్రభుత్వం చెబుతూనే, మరోవైపు సీఎం, మంత్రుల కార్యక్రమాల పేరుతో వేల కోట్ల ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారని ఆరోపించారు.కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు కాకుండా అటకెక్కిపోయాయని, ప్రజలను మభ్యపెట్టే విధంగా బడ్జెట్ రూపొందించారని అన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవర్తన కూడా తగిన విధంగా లేదని విమర్శించారు.బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను కొనసాగించకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యేలు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు.

Sthanikam

“ప్రజలను మోసం చేసిన బడ్జెట్”

Article Image

గ్యారంటీల అమలులో వైఫల్యం: సుర్కంటి శ్రీధర్ రెడ్డి మందోళ్ల గూడెం ఉపసర్పంచ్

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన బడ్జెట్‌గా నిలిచిందని మందోళ్ల గూడెం ఉపసర్పంచ్, బీఆర్‌ఎస్ పార్టీ చౌటుప్పల్ మండల అధికార ప్రతినిధి సుర్కంటి శ్రీధర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వృద్ధులకు పెన్షన్లు పెంచడం, కొత్తగా వితంతు పింఛన్లు మంజూరు చేయడం, రైతులకు రైతుబంధు అమలు చేయడం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించడం వంటి కీలక అంశాలకు నిధులు లేవని ప్రభుత్వం చెబుతూనే, మరోవైపు సీఎం, మంత్రుల కార్యక్రమాల పేరుతో వేల కోట్ల ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారని ఆరోపించారు.కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు కాకుండా అటకెక్కిపోయాయని, ప్రజలను మభ్యపెట్టే విధంగా బడ్జెట్ రూపొందించారని అన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవర్తన కూడా తగిన విధంగా లేదని విమర్శించారు.బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను కొనసాగించకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యేలు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News