Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:47 AM

ప్రజల్లో ఉన్నవారికే అవకాశం – అభ్యర్థుల ఎంపికపై మంత్రి వ్యాఖ్యలు

ప్రజల్లో ఉన్నవారికే అవకాశం – అభ్యర్థుల ఎంపికపై మంత్రి వ్యాఖ్యలు

ప్రజల్లో ఉన్నవారికే అవకాశం – అభ్యర్థుల ఎంపికపై మంత్రి వ్యాఖ్యలు
December 31, 2025 05:23 PM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఖమ్మంలోని ఎస్.ఆర్. కన్వెన్షన్ హాల్లో జరిగిన ఏదులాపురం మున్సిపాలిటీ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల్లో ఉండి నిరంతరం సమస్యలపై పోరాడే నాయకులకే అభ్యర్థిత్వం దక్కుతుందని స్పష్టం చేశారు. కటౌట్లు పెట్టడం, హడావుడి చేయడం వల్ల టికెట్లు రావని, గెలుపు సామర్థ్యం ఉన్నవారికే బి-ఫామ్ ఇస్తామని తేల్చి చెప్పారు.ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డుల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కదలాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం గత రెండేళ్లలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఉపాధి హామీ పథకం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ వంటి పథకాలు ప్రజలకు ఎలా మేలు చేస్తున్నాయో ఇంటింటికీ వివరించాలని అన్నారు.

ప్రతి వార్డులో పెండింగ్‌లో ఉన్న రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యలను గుర్తించి అధికారులకు నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే వీలైనంత పనులు పూర్తిచేసేందుకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఏదులాపురం మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని మంత్రి తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News