Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
“ఈ సమస్య పరిష్కరించేది ఎప్పుడో...?” “తాత్కాలికం కాదు… శాశ్వత పరిష్కారం సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 08:18 AM

ప్రజల్లో ఉన్నవారికే అవకాశం – అభ్యర్థుల ఎంపికపై మంత్రి వ్యాఖ్యలు

ప్రజల్లో ఉన్నవారికే అవకాశం – అభ్యర్థుల ఎంపికపై మంత్రి వ్యాఖ్యలు

ప్రజల్లో ఉన్నవారికే అవకాశం – అభ్యర్థుల ఎంపికపై మంత్రి వ్యాఖ్యలు
December 31, 2025 05:23 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఖమ్మంలోని ఎస్.ఆర్. కన్వెన్షన్ హాల్లో జరిగిన ఏదులాపురం మున్సిపాలిటీ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల్లో ఉండి నిరంతరం సమస్యలపై పోరాడే నాయకులకే అభ్యర్థిత్వం దక్కుతుందని స్పష్టం చేశారు. కటౌట్లు పెట్టడం, హడావుడి చేయడం వల్ల టికెట్లు రావని, గెలుపు సామర్థ్యం ఉన్నవారికే బి-ఫామ్ ఇస్తామని తేల్చి చెప్పారు.ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డుల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కదలాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం గత రెండేళ్లలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఉపాధి హామీ పథకం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ వంటి పథకాలు ప్రజలకు ఎలా మేలు చేస్తున్నాయో ఇంటింటికీ వివరించాలని అన్నారు.

ప్రతి వార్డులో పెండింగ్‌లో ఉన్న రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యలను గుర్తించి అధికారులకు నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే వీలైనంత పనులు పూర్తిచేసేందుకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఏదులాపురం మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని మంత్రి తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News