ప్రజలకు సేవ చేసే వారిని ఆదరించండి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గిర్కాటి నిరంజన్ గౌడ్
ప్రజలకు సేవ చేసే వారిని ఆదరించండి బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గిర్కాటి నిరంజన్ గౌడ్
K.RAVI
బీఆర్ఎస్ 1వ వార్డు అభ్యర్థి తోర్పునూరి మల్లేష్ గౌడ్
నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సేవ చేసే సీపీఐ (ఎం) బలపర్చిన బీఆర్ఎస్ 1వ వార్డు అభ్యర్థి తొర్పునూరి మల్లేష్ గౌడ్ ను గెలిపించి ఆదరించాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు గిర్కటి నిరంజన్ గౌడ్ కోరారు. శుక్రవారం లింగారెడ్డిగూడెం 1వ వార్డులో బీఆర్ఎస్, సీపీఐ (ఎం) నాయకులు మల్లేశ్ గౌడ్ ను గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా నిరంజన్ గౌడ్ మాట్లాడుతూ.కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి అధికారం లోకి వచ్చాక అమలుచేయడంలో విఫలం చెందిందన్నారు.తిరిగి తెలంగాణలో వచ్చే ఎన్నికలలో కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని అన్నారు.కారు గుర్తుకు ఓట్లు వేసి మల్లేశ్ గౌడ్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) వార్డు కార్యదర్శి ఉష్కాగుల శ్రీను, బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షులు బొమ్మిరెడ్డి వెంకట్రెడ్డి, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి