Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:58 PM

ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని గౌరవంగా భావించాలి గుత్తా సుఖేందర్ రెడ్డి

ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని గౌరవంగా భావించాలి గుత్తా సుఖేందర్ రెడ్డి

ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని గౌరవంగా భావించాలి గుత్తా సుఖేందర్ రెడ్డి
February 16, 2026 04:13 PM 303 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపల్ ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం

ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని గౌరవంగా భావించాలి – గుత్తా సుఖేందర్ రెడ్డిచిట్యాల పట్టణంలోని బి.ఆర్ ఫంక్షన్ హాల్‌లో చిట్యాల మున్సిపాలిటీ చైర్మన్ పందిరి గీత రమేష్, వైస్ చైర్మన్ లక్ష్మి సైదులు, కౌన్సిలర్లకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుత్తా సుఖేందర్ రెడ్డి, వేముల వీరేశం హాజరయ్యారు.

ముందుగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను అతిథులు శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం సభలో మాట్లాడిన గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం దక్కినందుకు గర్వపడాలని సూచించారు. ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల్లో ఉంటూ వారి కష్టసుఖాలలోభాగస్వాములవ్వాలని కోరారు.కౌన్సిలర్ పదవిని బాధ్యతగా నిర్వహిస్తే భవిష్యత్తులో పెద్ద నాయకులుగా ఎదగవచ్చని ఆయన తెలిపారు. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేస్తే పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ మున్సిపల్ ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి చిట్యాల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News