ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని గౌరవంగా భావించాలి గుత్తా సుఖేందర్ రెడ్డి
ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని గౌరవంగా భావించాలి గుత్తా సుఖేందర్ రెడ్డి
Komidala Mahender reddy
చిట్యాల మున్సిపల్ ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం
ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని గౌరవంగా భావించాలి – గుత్తా సుఖేందర్ రెడ్డిచిట్యాల పట్టణంలోని బి.ఆర్ ఫంక్షన్ హాల్లో చిట్యాల మున్సిపాలిటీ చైర్మన్ పందిరి గీత రమేష్, వైస్ చైర్మన్ లక్ష్మి సైదులు, కౌన్సిలర్లకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుత్తా సుఖేందర్ రెడ్డి, వేముల వీరేశం హాజరయ్యారు.
ముందుగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను అతిథులు శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం సభలో మాట్లాడిన గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం దక్కినందుకు గర్వపడాలని సూచించారు. ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల్లో ఉంటూ వారి కష్టసుఖాలలోభాగస్వాములవ్వాలని కోరారు.కౌన్సిలర్ పదవిని బాధ్యతగా నిర్వహిస్తే భవిష్యత్తులో పెద్ద నాయకులుగా ఎదగవచ్చని ఆయన తెలిపారు. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేస్తే పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ మున్సిపల్ ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి చిట్యాల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి