Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:55 AM

ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని గౌరవంగా భావించాలి గుత్తా సుఖేందర్ రెడ్డి

ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని గౌరవంగా భావించాలి గుత్తా సుఖేందర్ రెడ్డి

ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని గౌరవంగా భావించాలి గుత్తా సుఖేందర్ రెడ్డి
16-02-2026 323 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపల్ ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం

ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని గౌరవంగా భావించాలి – గుత్తా సుఖేందర్ రెడ్డిచిట్యాల పట్టణంలోని బి.ఆర్ ఫంక్షన్ హాల్‌లో చిట్యాల మున్సిపాలిటీ చైర్మన్ పందిరి గీత రమేష్, వైస్ చైర్మన్ లక్ష్మి సైదులు, కౌన్సిలర్లకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుత్తా సుఖేందర్ రెడ్డి, వేముల వీరేశం హాజరయ్యారు.

ముందుగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను అతిథులు శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం సభలో మాట్లాడిన గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం దక్కినందుకు గర్వపడాలని సూచించారు. ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల్లో ఉంటూ వారి కష్టసుఖాలలోభాగస్వాములవ్వాలని కోరారు.కౌన్సిలర్ పదవిని బాధ్యతగా నిర్వహిస్తే భవిష్యత్తులో పెద్ద నాయకులుగా ఎదగవచ్చని ఆయన తెలిపారు. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేస్తే పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ మున్సిపల్ ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి చిట్యాల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని గౌరవంగా భావించాలి గుత్తా సుఖేందర్ రెడ్డి

Article Image

చిట్యాల మున్సిపల్ ప్రజాప్రతినిధులకు ఘన సన్మానం

ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని గౌరవంగా భావించాలి – గుత్తా సుఖేందర్ రెడ్డిచిట్యాల పట్టణంలోని బి.ఆర్ ఫంక్షన్ హాల్‌లో చిట్యాల మున్సిపాలిటీ చైర్మన్ పందిరి గీత రమేష్, వైస్ చైర్మన్ లక్ష్మి సైదులు, కౌన్సిలర్లకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గుత్తా సుఖేందర్ రెడ్డి, వేముల వీరేశం హాజరయ్యారు.

ముందుగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను అతిథులు శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం సభలో మాట్లాడిన గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే గొప్ప అవకాశం దక్కినందుకు గర్వపడాలని సూచించారు. ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల్లో ఉంటూ వారి కష్టసుఖాలలోభాగస్వాములవ్వాలని కోరారు.కౌన్సిలర్ పదవిని బాధ్యతగా నిర్వహిస్తే భవిష్యత్తులో పెద్ద నాయకులుగా ఎదగవచ్చని ఆయన తెలిపారు. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేస్తే పట్టణ అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు.నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ మున్సిపల్ ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి చిట్యాల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News