ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే అభ్యర్థిని గెలిపించండి
ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే అభ్యర్థిని గెలిపించండి
Biksham
సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు పిలుపు
సూర్యాపేట టౌన్:
నిరంతరం వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడే పేదల అభ్యర్థి వల్లపు దాసు సాయికుమార్ను అధిక మెజార్టీతో గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు పిలుపునిచ్చారు.శనివారం 24వ వార్డులో సిపిఎం అభ్యర్థి గెలుపుకోసం నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, సిపిఎం అభ్యర్థులు గెలిస్తే వార్డులలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారానికి కౌన్సిల్లో గళం విప్పి పోరాడతారని అన్నారు.అవకాశవాదులను ఓడించి ప్రజల కోసమే పని చేసే వారిని గెలిపించాలని, డబ్బు, మద్యం, కుల ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటు వేసి ప్రజల పక్షాన నిలిచే అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎల్గూరి గోవింద్, వేల్పుల వెంకన్న, ధనియాకుల శ్రీకాంత్, వీరబోయిన రవి, మద్దెల జ్యోతి, పట్టణ నాయకులు అబ్బగాని బిక్షం, షేక్ సైదులు, కప్పల సత్యం, ఎల్గూరి ఆశాలు, దశరథ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి