ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యం : కమిషనర్ వి. ప్రశాంతి
ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యం : కమిషనర్ వి. ప్రశాంతి
Krishna
నారాయణఖేడ్ పట్టణంలోని ఒకటో వార్డులో మున్సిపల్ కమిషనర్ వి. ప్రశాంతి మంగళవారం పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా పరిస్థితులను పరిశీలించారు. వార్డులో చెత్తాచెదారం తొలగింపు, మురికి కాలువల శుభ్రపరిచే పనులు, రోడ్లకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కల తొలగింపు వంటి పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని మున్సిపల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలన్నారు.అదేవిధంగా చాంద్ కనపల్లి ప్రాంతంలో తాగునీటి సరఫరా సక్రమంగా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తాగునీటి సరఫరా సిబ్బందికి సూచించారు. నీటి సమస్యలు తలెత్తకుండా సమయానికి సరఫరా అందించడంతో పాటు పైపులైన్ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కమిషనర్ ఆదేశాల మేరకు పారిశుద్ధ్య పనులు వేగవంతం చేస్తున్నామని శానిటేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ పర్యటనలో ఒకటో వార్డు మున్సిపల్ కౌన్సిలర్ లలిత రామకృష్ణ,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి