Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వైఎస్సార్‌ తర్వాత వడ్డెరలకు అండగా నిలిచింది రేవంత్‌రెడ్డే మంత్రి సవితమ్మ ని కలిసిన పలువురు నాయకులు, కార్యకర్తలు రొద్దంలో ఘనంగా ఆంజనేయ స్వామి జయంతి వేడుకలు సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 12, 2026 06:38 PM

ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యం : కమిషనర్ వి. ప్రశాంతి

ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యం : కమిషనర్ వి. ప్రశాంతి

ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యం : కమిషనర్ వి. ప్రశాంతి
May 12, 2026 05:17 PM 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణంలోని ఒకటో వార్డులో మున్సిపల్ కమిషనర్ వి. ప్రశాంతి మంగళవారం పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా పరిస్థితులను పరిశీలించారు. వార్డులో చెత్తాచెదారం తొలగింపు, మురికి కాలువల శుభ్రపరిచే పనులు, రోడ్లకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కల తొలగింపు వంటి పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని మున్సిపల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలన్నారు.అదేవిధంగా చాంద్ కనపల్లి ప్రాంతంలో తాగునీటి సరఫరా సక్రమంగా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తాగునీటి సరఫరా సిబ్బందికి సూచించారు. నీటి సమస్యలు తలెత్తకుండా సమయానికి సరఫరా అందించడంతో పాటు పైపులైన్ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కమిషనర్ ఆదేశాల మేరకు పారిశుద్ధ్య పనులు వేగవంతం చేస్తున్నామని శానిటేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ పర్యటనలో ఒకటో వార్డు మున్సిపల్ కౌన్సిలర్ లలిత రామకృష్ణ,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News