Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:39 AM

ప్రజలకు అందుబాటులో ఉండి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి

ప్రజలకు అందుబాటులో ఉండి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి

ప్రజలకు అందుబాటులో ఉండి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి
December 18, 2025 05:29 PM 433 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజలకు అందుబాటులో ఉండి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలిt

రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి

స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట మండలంలో సిపిఎం బలపరిచిన మునిపంపుల, దుబ్బాక గ్రామాల సర్పంచులు బొడ్డుపల్లి వెంకటేశం, గట్టు నర్సింహాలను స్థానిక సిపిఎం కార్యాలయంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి సన్మానించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి, ప్రచారంజక పాలనతో గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రలోభాలు మితిమీరుతున్న పరిస్థితుల్లో, ప్రజలను ప్రలోభపెట్టకుండా పోరాటాలనే పెట్టుబడిగా పెట్టుకుని గెలుపొందడం అభినందనీయమని పేర్కొన్నారు.

ప్రజల సమస్యలను నిరంతరం అధ్యయనం చేసి పరిష్కారానికి చొరవ చూపాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన పేదలకు అందేలా చూడాలని అన్నారు. అర్హులైన వారికి ఇండ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు అందించి గ్రామాలను కమ్యూనిస్టు కోణంలో ఆదర్శంగా నిలపాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రాగిరు కిష్టయ్య, సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యుడు బోయని ఆనంద్, మాజీ వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గొరిగే సోములు, మండల కమిటీ సభ్యుడు మేడి గణేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News