Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 11:38 PM

ప్రజలకు అందుబాటులో ఉండి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి

ప్రజలకు అందుబాటులో ఉండి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి

ప్రజలకు అందుబాటులో ఉండి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలి
December 18, 2025 05:29 PM 429 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

ప్రజలకు అందుబాటులో ఉండి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలిt

రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి

స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

రామన్నపేట మండలంలో సిపిఎం బలపరిచిన మునిపంపుల, దుబ్బాక గ్రామాల సర్పంచులు బొడ్డుపల్లి వెంకటేశం, గట్టు నర్సింహాలను స్థానిక సిపిఎం కార్యాలయంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి సన్మానించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి, ప్రచారంజక పాలనతో గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రలోభాలు మితిమీరుతున్న పరిస్థితుల్లో, ప్రజలను ప్రలోభపెట్టకుండా పోరాటాలనే పెట్టుబడిగా పెట్టుకుని గెలుపొందడం అభినందనీయమని పేర్కొన్నారు.

ప్రజల సమస్యలను నిరంతరం అధ్యయనం చేసి పరిష్కారానికి చొరవ చూపాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన పేదలకు అందేలా చూడాలని అన్నారు. అర్హులైన వారికి ఇండ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు అందించి గ్రామాలను కమ్యూనిస్టు కోణంలో ఆదర్శంగా నిలపాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు రాగిరు కిష్టయ్య, సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యుడు బోయని ఆనంద్, మాజీ వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు గొరిగే సోములు, మండల కమిటీ సభ్యుడు మేడి గణేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News